పత్తి లారీకి మంటలు... తప్పిన ప్రమాదం | Sakshi
Sakshi News home page

పత్తి లారీకి మంటలు... తప్పిన ప్రమాదం

Published Wed, Apr 27 2016 5:10 PM

fires accident to a cotton Lorry

పత్తి లారీకి విద్యుత్ తీగలు తాకడంతో మంటలు చెలరేగాయి. అయితే, స్థానికులు సత్వరం స్పందించడంతో తృణిలో పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం కొత్తముచ్చుమర్రి గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓర్వకల్లు మండలం కాల్వ ఉసేనాపురం గ్రామానికి చెందిన పత్తి వ్యాపారి నారాయణ... కొత్త ముచ్చుమర్రిలో పత్తిని కొనుగోలు చేశాడు. బుధవారం ఆ పత్తినిలారీలోకి లోడ్ చేయిస్తున్న క్రమంలో ఈప్రమాదం చోటు చేసుకుంది. రెండు క్వింటాళ్ల మేర పత్తికి నష్టం వాటిల్లినట్టు వ్యాపారి నారాయణ తెలిపాడు.

 

Advertisement
Advertisement