‘‘అమ్మా.. లేమ్మా.. స్కూల్కు టైం అవుతోంది.. రెడీ చేయమ్మా’’ అంటూ పదేళ్ల బాలుడు విగతజీవిగా మారిన తల్లిని తట్టిలేపేందుకు చేస్తున్న ప్రయత్నం అక్కడున్న వారందరి గుండెలను ద్రవింపజేసింది. కోదాడ మండలం గోండ్రియాల గ్రామానికి చెందిన తండ్రీకూతురు పుసుళూరి వెంకటేశ్వర్లు(55), కొల్లు రమాదేవి(30) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతిచెందారు. ఎనిమిదేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో తన ఇద్దరు బిడ్డలతో బతుకీడుస్తున్న రమాదేవి కూడా ప్రమాదవశాత్తు మృతిచెందడంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు.
- కోదాడరూరల్
* విద్యుదాఘాతంతో తండ్రీకూతురు మృతి
* కోదాడ మండలం గోండ్రియాలలో విషాదం
* ఉతికిన బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదం
* అనాథలైన ఇద్దరు చిన్నారులు
గోండ్రియాల గ్రామానికి చెందిన పుసుళూరి వెంకటేశ్వర్లు(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి నలుగురు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు కాగా మరో ఇద్దరు కుమార్తెలు చదువుకుంటూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు.
ఎనిమిదేళ్ల క్రితమే భర్తను కోల్పోయి..
వెంకటేశ్వర్లు పదెద కుమార్తె కొల్లు రమాదేవి(30)కి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదలబండకు చెందిన వ్యక్తితో పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కారణాలైతే తెలియవు కానీ అతను ఎనిమిదేళ్ల క్రితమే మృతి చెందాడు. దీంతో రమాదేవి కుమారుడు సందీప్( 5వ తరగతి), కుతూరు మనస్వీ (3వ తరగతి)ని తీసుకుని పుట్టింటికి చేరింది. స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివిస్తోంది.
బట్టలు ఆరవేస్తుండగా..
రమాదేవి శుక్రవారం తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు చక్కబెట్టుకుంటోంది. ఈ క్రమంలో పిల్లల బట్టలు, స్కూల్ బ్యాగ్లను ఉతికి ఇంటి ఆవరణలో గల దండెంపై ఆరవేస్తోంది. ఈ క్రమం లో ఒక్క సారిగా విద్యుదాఘాతానికి గురై అరవడంతో సమీపంలోనే ఉన్న ఆమె తండ్రి వెంకటేశ్వర్లు గమనించారు. కూతురిని కాపాడేందుకు కర్ర తో దండెం తీగను బలంగా కొట్టాడు. ఆ తీగ తెగి వెంకటేశ్వర్లుపై పడడంతో అతను కూడా విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఇది గమనించి ఆయన భార్య సావిత్ర దగ్గరికి వెళ్లగా ఆమె కూడా షాక్కు గురై కొంత దూరంలో ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు, రమాదేవి అక్కడికక్కడే మృతిచెం దగా, సావిత్రి ప్రాణాపాయం తప్పింది.
తీగ పైపొర ఊడిపోవడంతో..
వెంకటేశ్వర్లు ఇంట్లోకి తీసుకున్న కరెంట్తీగతో పాటు ఉన్న జే వైర్ను నేరుగా పోల్ నుంచి రేకుల కింద వేసిన రాడ్డుకు కట్టారు. అక్కడ తీగ పైపొర ఉడిపోవడంతో పాటు గురువారం రాత్రి కురిసిన వర్షానికి షార్ట్సర్క్యూట్ జరిగి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
మిన్నంటిన రోదనలు
విద్యుదాఘాతంతో తండ్రీకూతురు మృతిచెందడంతో గోండ్రియాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిని కూడా కోల్పోయి అనాథలైన చి న్నారులు, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న రూరల్ పోలసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కోదాడ ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులను డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు పరామర్శించారు.
అమ్మా.. లేమ్మా.. స్కూల్కు టైం అవుతోంది..
Published Sat, Jun 25 2016 3:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నర్రెడ్డి సునీత, రాజశేఖర్రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు
మేమంతా సీఎం వైఎస్ జగన్ వెంటే
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
సుండుపల్లెలో టీడీపీకి షాక్
సింహ వాహనంపై దేవదేవుడు
టీడీపీ ప్రచారంలో రాష్ట్రీయ సమాజ్ దళ్(ఆర్) అభ్యర్థి
రైతన్నలకు విత్తన రాయితీ
ప్రధాని పదవికి విలువ లేకుండా చేశారు
794 ఫిర్యాదులకు పరిష్కారం
పథకాలు కొనసాగాలంటే జగనన్న రావాలి
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement