హైదరాబాద్‌లో శ్రీమ్ గ్రూప్ విస్తరణ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో శ్రీమ్ గ్రూప్ విస్తరణ

Published Sat, Jul 26 2014 1:15 AM

హైదరాబాద్‌లో శ్రీమ్ గ్రూప్ విస్తరణ - Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గుజరాత్ కంపెనీ శ్రీమ్ గ్రూప్ హైదరాబాద్‌కు విస్తరిస్తోంది. గ్రూప్‌కు చెందిన లీడ్ క్రాప్ సెన్సైస్ రూ.42 కోట్లతో డిసెంబరులోగా ప్లాంటు నెలకొల్పుతోంది. పంటలకు అవసరమైన పోషక ఉత్పత్తులను ఈ ప్లాంటులో తయారు చేస్తారు. యూరప్‌కు చెందిన ఓ కంపెనీ ఉత్పత్తులను తామిక్కడ తయారు చేస్తామని గ్రూప్ డెరైక్టర్ వినోద్ లహోటి తెలిపారు. ఫొరీన్ లైఫ్ సెన్సైస్ రూ.25 కోట్లతో ఫార్మా యూనిట్ ఏర్పాటు యోచన ఉందన్నారు.  కొరియా కంపెనీ నౌస్‌బో ఉత్పత్తి సిల్‌ట్రాన్‌ను శుక్రవారం ఇక్కడ విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
 
టౌన్‌షిప్ కూడా..: గుజరాత్‌లోని ఆనంద్ వద్ద శ్రీమ్ గ్రూప్ భారీ టౌన్‌షిప్ ప్రాజెక్టు చేపట్టింది. ఇటువంటి ప్రాజెక్టునే గోవాతోపాటు హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తామన్నారు. నీటిలో సులభంగా కరిగేలా ట్యాబ్లెట్ల రూపంలో నౌస్‌బో తయారు చేసిన సిలికా ఆధారిత సిల్‌ట్రాన్ ట్యాబ్లెట్లను లీడ్ క్రాప్ భారత్‌లో మార్కెట్ చేస్తోంది. ఈ ట్యాబ్లెట్లతో ఎన్‌పీకే ఎరువుల వాడకం గణనీయంగా తగ్గుతుందని కంపెనీ తెలిపింది.

Advertisement
Advertisement