బెంగళూరు/ముంబై: ఈ పండుగల సీజన్లో ఆన్లైన్ వ్యాపారం వేడెక్కుతోంది. ఈ కామర్స్ దిగ్గజాల, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, అమెజాన్ సంస్థలు భారీ స్థాయిలో అమ్మకాలే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ సంస్థ ద బిగ్ బిలియన్ డేస్ పేరుతో పండుగల సీజన్ అమ్మకాలను మంగళవారం నుంచి ప్రారంభించింది. పోటీ సంస్థలు, స్నాప్డీల్, అమెజాన్ సంస్థలు ఈ పండుగ సీజన్ను ఒక పేరుతో బ్రాండింగ్ చేయకపోయినా, ఇవి కూడా వినియోగదారులను ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తున్నాయి.
ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదంటూ పండుగల సీజన్ కొనుగోళ్ల కోసం ఫ్లిప్కార్ట్ భారీ ప్రచారం నిర్వహిస్తోంది. దాదాపు పది లక్షల ఫ్యాషన్ ఉత్పత్తులపై 80 శాతం వరకూ డిస్కౌంట్ను ఇస్తామని అంటోంది. ప్రతీ గంటకు కొత్త ఆఫర్లిస్తామని స్నాప్డీల్, రోజూ 1 కేజీ బంగారం గెల్చుకునే అవకాశముందని, ఒక్క రోజులోనే డెలివరీ ఇస్తామని అమెజాన్ ఇండియాలు ఊరిస్తున్నాయి.
10 గంటల్లో 10 లక్షల వస్తువుల అమ్మకాలు
13వ తేదీన 10 గంటల్లో పది లక్షలకు పైగా వస్తువులను విక్రయించామని దేశవ్యాప్తంగా 60 లక్షల హిట్స్ వచ్చాయని, ఒక సెకన్కు 25 వస్తువులను అమ్మామని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. మెట్రో నగరాల్లో బెంగళూరు, ఢిల్లీ, చెన్నైల నుంచి, ఇతర నగరాల్లో లూధియానా, లక్నో, భోపాల్ల నుంచి ఎక్కువగా హిట్స్ వచ్చాయని పేర్కొంది.
ఇప్పటివరకూ పాదరక్షలు, పురుషుల దుస్తులు, యాక్సెసరీలు బాగా అమ్ముడయ్యాయని ఫ్లిప్కార్ట్ హెడ్ ముకేష్ బన్సాల్ చెప్పారు. గత రెండు రోజుల్లో 16 లక్షల యాప్ డౌన్లోడ్లు జరిగాయని, 70 కేటగిరీల్లో 3 కోట్ల వస్తువులను ఆఫర్ చేసున్నట్లు పేర్కొన్నారు.
ఉదయమే డెలివరీ అమెజాన్
అర్ధరాత్రి వరకూ ఆర్డర్ చేసిన వస్తువులను మరునాడు ఉదయం 11 గంటలలోపు డెలివరీ చేసే మార్నింగ్ డెలివరీ సర్వీస్ను అమెజాన్ అంది స్తోంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ/ఎన్సీఆర్, ముంబైల్లో ఈ మార్నింగ్ డెలివరీ సర్వీస్ అందుబాటులో ఉంటుందని అమెజాన్ ఇండియా కస్టమర్ ఎక్స్పీరియన్స్ హెడ్ అక్షయ్ సాహి చెప్పారు. ఆర్డర్కు రూ.120 ఫ్లాట్ చార్జీతో ఈ ఆఫర్ను అందిస్తున్నామని తెలిపారు. ఒకవేళ ఉదయం 11 గంటలలోపు ఆర్డర్ చేస్తే, ఆ వస్తువులను అదే రోజు డెలివరీ చేసే వెసులుబాటు కూడా ఉందని వివరించారు.
‘ఆన్లైన్’ పండుగ..!
Published Wed, Oct 14 2015 12:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈవీఎంల స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ట బందోబస్తు
ప్రతి అంశంపై అవగాహన ఉండాలి
ఎఫ్ఎస్టీపీని పరిశీలించిన ప్రతినిధి
ఈదురుగాలుల బీభత్సం
11న జిల్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు న్యాయం
ఉల్లి క్వింటా రూ.2,400
అధికారం వెంటే నేతలు..!
పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement