రోజాను ఫోన్లో పలకరించిన వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

రోజాను ఫోన్లో పలకరించిన వైఎస్ జగన్

Published Sat, Sep 13 2014 5:38 PM

వైఎస్ జగన్మోహన్ రెడ్డి - Sakshi

హైదరాబాద్: వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే రోజాను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఫోన్లో పలకరించారు. చిత్తూరు జిల్లా నగరిలో టిడిపి నేతలు, కార్యకర్తలు రోజాపై దాడి చేసిన విషయం తెలిసిందే. అమ్మవారి జాతరలో పాల్గొన్న రోజాపై వారు దౌర్జన్యం చేశారు.

జగన్ ఫోన్లో రోజాతో మాట్లాడి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రోజాపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసుల సమక్షంలో ఒక మహిళా ఎమ్మెల్యేపై దాడి జరగడం దారుణం అని  జగన్  అన్నారు.
**

Advertisement
Advertisement