'డ్వాక్రా రుణాలు మాఫీ చేసేవరకు నిద్రపోనివ్వం' | Sakshi
Sakshi News home page

'డ్వాక్రా రుణాలు మాఫీ చేసేవరకు నిద్రపోనివ్వం'

Published Fri, Jan 30 2015 3:35 PM

'డ్వాక్రా రుణాలు మాఫీ చేసేవరకు నిద్రపోనివ్వం' - Sakshi

బొబ్బిలి(విజయనగరం): డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేసేవరకు ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..సంపూర్ణంగా రుణమాఫీ చేసేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.

ప్రభుత్వం సకాలంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల బ్యాంకులు కొత్త రుణాల మంజూరు చేయటం లేదన్నారు. దీంతో రైతులకు కొత్త రుణాలు అందకపోగా..డ్వాక్రా మహిళలపై బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైనా  రుణమాఫీ చేయకపోవడం వల్లే డ్వాక్రా మహిళలకు అండగా జగన్ దీక్ష చేస్తున్నారని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement