- అరెస్టుల ప్రచారంతో ఆందోళనలు
- రోగుల వైద్యసేవలపై తీవ్ర ప్రభావం
- అయోమయంలో రోగులు
గుంటూరు మెడికల్ : నిత్యం అంబులెన్స్ల మోత, రోగులు, వారి సహాయకుల రాకపోకలతో హడావుడిగా ఉండే గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి.. ప్రస్తుతం సమ్మె, నిరసన గళాల హోరుతో మార్మోగుతోంది. డాక్టర్లు, సిబ్బంది నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై, ప్రతిరోజూ గంటసేపు నిరసన తెలుపుతున్నారు. జీజీహెచ్లో ఎలుకలదాడిలో పసికందు మృతిపై ప్రభుత్వం ఆస్పత్రి సిబ్బందిపై తీసుకున్న క్రమశిక్షణ చర్యలను నిరసిస్తూ గత నెల 29నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం, ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం నిరసనలను ఉధృతం చేస్తున్నాయి.
కేవలం గుంటూరుకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని బోధనా ఆస్పత్రుల్లో సైతం ప్రారంభమయ్యాయి. నర్సుల సంఘం రాష్ట్ర నేతలు గుంటూరు జీజీెహ చ్కు వచ్చి మద్దతు తెలిపారు. వైద్యుల సంఘం సెంట్రల్ కమిటీ నేతలు గురువారం జీజీహెచ్కు వచ్చి తమ మద్దతు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమశిక్షణ చర్యలను సహించబోమని, ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సంఘాల నేతలు పట్టుపడుతున్నారు. ఆస్పత్రిలో ఎలుకలు ఉన్నాయని పలుమార్లు లిఖితపూర్వకంగా చెప్పినా పట్టించుకోకుండా నేడు తమను బాధ్యలుగా చేయడం అన్యాయమని స్పష్టం చేస్తున్నారు.
అరెస్టులు జరుగుతాయంటూ ప్రచారం..
జీజీహెచ్లో ఎలుకల దాడి సంఘటనలో పసికందు మృతిచెందడంపై చిన్నారి తల్లి చావలి లక్ష్మి కొత్తపేట ఠాణాలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. విచారణ చేస్తున్న సమయంలోనే మూడు రోజులుగా పసికందు మృతిపై ఆస్పత్రి సిబ్బందిని అరెస్టు చేస్తున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ సంఘటనతో వెద్యులు, వైద్య సిబ్బంది భయాందోళనలో ఉన్నారు. అయోమయంలో రోగులు.. గత నెల 26న ఎలుకల దాడిలో పసికందు మృతిచెందిన నాటినుంచి ఆస్పత్రిలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలపై రోగులు అయోమయానికి గురవుతున్నారు.
పలుమార్లు కలెక్టర్ ఆస్పత్రిలో తనిఖీలకు వస్తూ ఉండడం, రెండు పర్యాయాలు ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆస్పత్రిలో తనిఖీలు చేయడం, వీరితోపాటుగా ఎస్పీలు, ఎంపీ గల్లా జయదేవ్, పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నేతలు, ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నేతలు ఆస్పత్రిలో నిరసనలు తెలియజేస్తూ ఉండడంతో ఆస్పత్రిలో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. వైద్యులు, వైద్య సిబ్బంది నిరసనల ప్రభావం రోగుల వైద్యసేవలపై కనిపిస్తోంది. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించి ఎలాంటి అవరోధాలు లేకుండా రోగులకు వైద్యసేవలను అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
అరెస్ట్ల నుంచి కాపాడాలని కలెక్టర్కు వినతి...
జీజీహెచ్లో గురువారం నిరసన ప్రదర్శన జరిగింది. అనంతరం వైద్యులు, నర్సులు ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్లి సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఆస్పత్రిలో పసికందు చనిపోయినప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయో నేడు కూడా అవే పరిస్థితులు ఉన్నాయని, సమస్యలు పరిష్కరించకుండా రోగులను అడ్మిట్ చేసుకుంటే రోగులకు వైద్యసిబ్బందికి రిస్క్ ఉంటుందని భయాందోళనలు వ్యక్తం చేశారు. తమకు సంబంధం లేకపోయినా అరెస్టులు చేస్తారంటూ ప్రచారం జరుగుతోందని, అరెస్టుల నుంచి తమను కాపాడాలని నాయకులు లిఖితపూర్వకంగా కోరారు. స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ జీజీహెచ్లో సమస్యలను పరిష్కరిస్తానని, వైద్య సిబ్బంది ఎలాంటి భయాందోళనలు లేకుండా వైద్యసేవలు అందించాలన్నారు.
జీజీహెచ్లో నిరసన గళం
Published Fri, Sep 4 2015 4:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement