రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Published Tue, May 23 2017 10:46 AM

two killed in road accident at prakasam district

టంగుటూరు : ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరరెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిఫై ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా ఇద్దరు పిల్లలు సహా ఎనిమిదిమంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

తిరుపతి నుంచి గుంటూరు వెళ్తున్న టాటా సఫారీ వాహనం సూరారెడ్డిపాలెం పెట్రోల్ బంకు వద్దకు ఆగి ఉన్న పత్తి లోడు లారీని ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ సుబ్బారావు, పక్క సీట్లో ఉన్న సాయి శంకర్‌లు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఘటనా స్థలికి చేరుకున్న ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు వాహనంలో చిక్కుకున్న క్షతగాత్రులను వెలికి తీసి ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. వీరంతా గుంటూరు కొత్తపేటకు చెందిన వారుగా తెలుస్తోంది. కారు డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement