పులివెందులలో గిరిజనులపై టీడీపీ కార్యకర్తల దాడి | Sakshi
Sakshi News home page

పులివెందులలో గిరిజనులపై టీడీపీ కార్యకర్తల దాడి

Published Tue, Sep 30 2014 7:39 PM

TDP cadre attacks on Tribal in Pulivendula of YSR District

కడప: వైఎస్ఆర్ జిల్లాలో గిరిజనులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేసిన సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన పులివెందులలో చోటు చేసుకుంది. గిరిజనులపై దాడి ఘటనతో గంట సేపు పులివెందులలో యుద్ధవాతావరణం నెలకొంది. 
 
ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై గిరిజనులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిరిజనుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. 
 

Advertisement
Advertisement