ఎయిరిండియా విమానం ఏసీలో పొగలు | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానం ఏసీలో పొగలు

Published Mon, Apr 14 2014 8:49 AM

Smog from air india flight in shamshabad airpot

హైదరాబాద్: ఎయిరిండియా విమానం ఏసీలో పొగలు రావడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో నిలిపివేశారు. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.  

హైదరాబాద్-మధురపూడి (రాజమండ్రి విమానాశ్రయం) మధ్య నడిచే జెట్ ఎయిర్‌వేస్ విమానానికి ఆదివారం తృటిలో పెద్ద ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక పక్షి విమానం ఫ్యాన్ రెక్కల్లోకి చొచ్చుకుపోయింది. అయితే, పైలట్లు అప్పటికే విమానాన్ని రన్‌వేపై దింపడంతో ఎలాంటి ఆపదా వాటిల్లలేదు. ఇదే విమానంలో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఉన్నారు. ఫ్యాన్ రెక్కల్లో ఇరుక్కున్న పక్షి నుజ్జునుజ్జు కావడంతో ఇంజన్‌లో సమస్య తలెత్తింది.

Advertisement
Advertisement