స్కూల్ బస్సు ఢీకొని ఉపాధ్యాయుడు మృతి | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు ఢీకొని ఉపాధ్యాయుడు మృతి

Published Tue, Dec 1 2015 11:07 AM

School bus hit and killed a teacher

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం ఒంగోలు పరిధిలోని మండువారిపాలెంలోని ముక్తినూతల పాలెంలో జరిగింది. ముక్తినూతల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కూరపాటి కృష్ణంరాజు(43) ఉదయం పాఠశాలకు బైక్‌పై ఇంటికి వెళుతున్నాడు. ఓ ప్రైవేటు స్కూల్‌కి చెందినబస్సు ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీ కొట్టడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement
Advertisement