ఇసుక మాఫియా ఘాతుకం! | Sakshi
Sakshi News home page

ఇసుక మాఫియా ఘాతుకం!

Published Mon, Sep 1 2014 5:17 PM

sand mafia attempt to murder

విజయనగరం: విజయనగరం జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు హద్దులేకుండా పోతోంది. పూసపాటి రేగ మండలం కోనయ్యపాలెం గ్రామంలో ఘాతుకానికి పాల్పడ్డారు. అక్రమ ఇసుక రవాణాని అడ్డుకున్న ఆర్ఐపై హత్యాయత్నం చేశారు. ఆర్ఐ మురళీ కృష్ణని ట్రాక్టర్తో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించారు.

ఆర్ఐ తీవ్రంగా గాయపడ్డారు. నిందితులు పారిపోయారు. ఆర్ఐని చికిత్స నిమిత్తం విజయనగరం ఆస్పత్రికి తరలించారు. గత కొద్ది నెలలుగా రెవెన్యూ సిబ్బంది ఇసుక అక్రమ రవాణాని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. దాంతో వారు ఏకంగా ఆర్ఐపై హత్యాయత్నమే చేశారు.

Advertisement
Advertisement