కొనాల్సింది 18 మిలియన్ కేజీలు
మంత్రి మాట
సెప్టెంబర్ నెలాఖరుకల్లా మొత్తం 172 మిలియన్ కిలోల పొగాకు కొంటాం. అదనంగా పండిన పొగాకును కూడా కొనుగోలు చేస్తాం.
ఈ నెల 18న జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర వాణిజ్య శాఖామంత్రి నిర్మలాసీతారామన్ పొగాకు రైతులకు ఇచ్చిన హామీ.
నీటి మూట
మంత్రి హామీతో కొనుగోళ్లు ఊపందుకుంటాయనుకున్నారు. ఆమె వచ్చి రైతులను పరామర్శించి వెళ్లి పది రోజులు దాటిపోయింది. గిట్టుబాటు ధర ఇంకా ఎగతాళి చేస్తూనే ఉంది. గడువు ఇంకా రెండు రోజులే ఉంది.
- కేంద్ర మంత్రి హామీ నత్తనడక
- కొనసాగుతున్న పొగాకు సంక్షోభం
- జగన్ హుంకరిస్తే కాస్తా జరిగింది
- సీఎం చంద్రబాబుదీ ప్రేక్షకపాత్రే
కదలిక
బుధవారం జిల్లాకు జగన్మోహన్రెడ్డి రానున్నారన్న వార్త తెలిసిన బాబు సర్కార్.. సోమవారం కొంతమేర ధర పెంచి కొనుగోళ్లు జరిపారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు సంక్షోభం రైతుల్లో కాటేస్తూనే ఉంది. వరుసగా విషాదాలు చోటుచేసుకోవడంతో పది రోజుల కిందట కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హడావుడిగా ఒంగోలు వచ్చి నిరసనల మధ్యనే బాధితులను పరామర్శించారు. అదే రోజు సీఎం చంద్రబాబు సమక్షంలో సమీక్ష నిర్విహంచి హామీలు గుప్పించినా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తక్కువ రకం పొగాకు విక్రయం తయారైంది. ఇంకా 18 మిలియన్ కిలోలకుపైగా పొగాకు రైతుల వద్ద ఉండిపోయింది. ఇది కాకుండా అనధికారికంగా పండిన మరో 15 నుంచి 20 మిలియన్ కిలోల పొగాకు కూడా రైతుల వద్దే ఉంది.
ఇంకా మిగిలిన రెండు రోజుల్లో ఈ మొత్తాన్ని ఎలా కొనుగోలు చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నవుతున్నాయి. ఈ దశలో రైతులకు అండగా ఈ నెల 30న టంగుటూరు వేలం కేంద్రం ఎదుట వైఎస్ జగన్ ధర్నా చేయనున్నారన్న వార్తతో సోమవారం కొంతమేర ధర పెంచి కొనుగోళ్లు జరిపారు.
ఇప్పటికి కొనుగోలు చేసంది 142 మిలియిన్ కిలోలే...
ఈ నెల 18న మంత్రి పర్యటన జరిగే సమయానికి 172 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటి వరకూ 142 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ నెలాఖరుకల్లా పూర్తిగా కొనుగోలు చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. అయితే మంత్రి హామీ అమలుకు నోచుకోలేదు. ఈ నెల 24 వరకూ 150.8 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలయింది. ఈ రెండు రోజుల్లో మరో రెండు మూడు మిలియన్ కిలోలకు మించి అమ్ముడు పోలేదు. అంటే ఇంకా సుమారు 18 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయాల్సి ఉంది.
సోమవారం కూడా జిల్లాలో మొత్తం ఏడు వేలం కేంద్రాల్లో 6,335 బేళ్లను రైతులు తీసుకురాగా అందులో 1940 బేళ్లు అమ్ముడుపోలేదు. 1416 బేళ్లను నో బిడ్ చేశారు. మొత్తం 4395 బేళ్లు అమ్ముడుపోయాయి. మొత్తం మీద ఐదు లక్షల కిలోలు కూడా కొనుగోలు చేయని పరిస్థితి ఉంది. ధర కూడా లోగ్రేడ్కు రూ.59 ఏవరేజీ వచ్చింది. ఇంకా రెండు రోజుల్లో మొత్తం పొగాకును ఎలా కొనుగోలు చేస్తారన్నదానికి బోర్డు అధికారుల నుంచి సమాధానం లేదు. వాణిజ్య మంత్రి జిల్లాకు వచ్చిన రోజునుంచి అమ్మిన పొగాక్కి కేజీకి రూ.20 కలుపుతామని ప్రకటించినా ఇంత వరకు అధికారికంగా బోర్డుకు ఉత్తర్వులు రాలేదు. 90 శాతం పొగాకు అమ్ముకున్నాక చివరి అమ్మకాలకు కలిపినా రైతుకు ప్రయోజనం శూన్యమని రైతులు ధ్వజమెత్తుతున్నారు.
ఇక మిగిలింది 48 గంటలే...
Published Tue, Sep 29 2015 2:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement