విజయవాడ : ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ను పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్థులు (జూడాలు) కోరారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు వస్తే వైద్యం చేసేందుకు సరైన సౌకర్యాలు లేవని వివరించారు. ప్రభుత్వాస్పత్రిలో బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం జరుగుతుండగా జూడాలు కాంత్రి, స్నిగ్ధ, మనోజ్, తనోజ్ తదితరులు మంత్రి వద్దకు వెళ్లి ఆస్పత్రిలోని సమస్యలను ఏకరువు పెట్టారు.
రోగి ప్రాణాపాయస్థితిలో వస్తే వైద్యం చేసేందుకు పరికరాలు లేవని, ఏడు వెంటిలేటర్లు ఉంటే ఒక్కటే పనిచేస్తోందని, అత్యవసర మందులు సైతం అందుబాటులో లేవని, సూపర్స్పెషాలిటీ విభాగాల్లో వైద్యులు లేరని, వైద్య కళాశాల, ఆస్పత్రి ప్రాంగణంలో డ్రెయినేజీ, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని వివరించారు. స్పందించిన మంత్రి కామినేని ఈ విషయంలో తానేమీ మాట్లాడలేకపోతున్నానని, ఇన్ని సమస్యలు ఉంటే ఏమి చేస్తున్నారని బాధ్యులను ప్రశ్నించారు. వాటిని పరిష్కరించేందుకు రూ.10 కోట్లు అవసరమని ఏపీహెచ్ఎండీసీ ఇంజినీర్లు తెలపగా, తక్షణమే రూ.కోటి వెచ్చించి పనులు చేపట్టాలని ఆదేశించారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు కూడా ఏడాదిన్నర కాలంగా పెండింగ్లో ఉన్నాయని మంత్రికి తెలిపారు.
ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యు.సూర్యకుమారి, సివిల్సర్జన్ ఆర్ఎంవో డాక్టర్ సావిత్రమ్మ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జె.సరసిజాక్షి, ఏపీహెచ్ఎండీసీ ఈఈ లక్ష్మీనారాయణ, డీఈ నాంచారయ్య, జిల్లాలోని క్లస్టర్ అధికారులు, వైద్య విధాన పరిషత్ అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలు కల్పించండి
Published Thu, Sep 18 2014 2:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement