చెట్టెక్కిన చిరుత... భయాందోళనలో గ్రామస్తులు | Sakshi
Sakshi News home page

చెట్టెక్కిన చిరుత... భయాందోళనలో గ్రామస్తులు

Published Thu, Jan 29 2015 9:14 AM

చెట్టెక్కిన చిరుత... భయాందోళనలో గ్రామస్తులు - Sakshi

కడప : వైఎస్ఆర్ కడప జిల్లా వీరబల్లి మండలం సానిపాయ గ్రామంలో గురువారం చిరుతపులి కలకలం సృష్టించింది. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి గ్రామంలో ప్రవేశించిన చిరుత ముళ్ల పొదల్లో నక్కి ఉంది. ఆ విషయాన్ని గమనించిన గ్రామస్తులు తీవ్ర భయాందోళనతో పరుగులు తీశారు. పొదల్లో నక్కిన చిరుత చెట్టుపైకి ఎక్కి కుర్చుంది. దాంతో గ్రామస్తుల ఆందోళన మరింత పెరిగి... అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు.

Advertisement
Advertisement