ప్రాధేయపడ్డా కరుణించని అధికారులు
బత్తలపల్లి : మండలంలోని డీ.చెర్లోపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు దరూరి రామకృష్ణకు చెందిన బోరు బావిని ఆ గ్రామ టీడీపీ నాయకుల ఒత్తిడితో రెవెన్యూ అధికారులు బుధవారం పోలీసు బందోబస్తు మధ్య సీజ్ చేశారు. బోరు సీజ్ చేస్తే పంటలు ఎండి పోతాయని, పెట్టుబడులు నష్ట పోయి అప్పులు పాలవుతామని అధికారులకు ఎంత మొర పెట్టుకున్నా కనికరం చూపలేదని బాధిత రైతు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా గ్రామానికి చెందిన గరిశల బావికి సమీపంలో బోరు వేసినందునే వాల్టా చట్టం ప్రకారం బోరును సీజ్ చేశామని ఇన్చార్జ్ తహశీల్దార్ సురేష్బాబు అన్నారు. దీనిపై బాధిత రైతు మాట్లాడుతూ తనకున్న భూమిలో 1000 చీనీ చెట్లు, 600 జామ చెట్లు, ఐదెకరాల్లో టమాటా పంట సాగు చేశామన్నారు. వీటికి చిత్రావతి నదిలో 30 ఏళ్ల క్రితం వేసుకున్న బోరు ద్వారా నీటిని పారిస్తూ పంటల్ని రక్షించుకుంటున్నామన్నారు. చిత్రావతి నది పరీవాహక ప్రాంతంలోని రైతులందరూ తన లాగే బోర్లు వేసుకున్నారని, ఇలాంటివి దాదాపు 100 నుంచి 120 వరకు ఉన్నాయని తెలిపారు. రాజకీయ కుట్రతోనే తమ బోరును సీజ్ చేశారని, తాను ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతుగా పని చేసినందుకే ఈ కుట్ర జరిగిందని పేర్కొన్నారు. తనను ఆర్థికంగా దెబ్బ తీయడానికి టీడీపీ నాయకులు అధికారులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోయాడు. న్యాయం జరగకుంటే కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకుంటామని బాధితుడు హెచ్చరించాడు. కలెక్టర్గారు.. మా గ్రామానికి రండి... ఎంత మంది రైతులు చిత్రావతి నదిలో బోర్లు వేసుకున్నారు? చూడండి.. తాను వేసుకున్న బోరును, పంటలను పరిశీలించండి.. తమకు న్యాయం చేయండి..’ అంటూ పత్రికా ముఖంగా వేడుకున్నారు. తమకు 3 వారాలు గడువు ఇవ్వాలని తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం వినతి పత్రం అందజేసినా బోరును సీజ్ చేయడం ఎంత వరకు సమంజసమని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. బోరును సీజ్ చేసిన అధికారులకు మిగతా బోర్లు కనిపించలేదా? అంటూ పులువురు నిలదీశారు. ఆర్ఐ సుబ్బారావు, వీఆర్ఓ ఆదినారాయణ, ఎస్ఐ శాంతిలాల్, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ నాయకుడి బోరు బావి సీజ్
Published Thu, Oct 2 2014 1:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement