రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా కదంతొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జగ్జీవన్రామ్లకు ఘనంగా నివాళులు
గుంటూరు నగరంలో ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం
13 జిల్లాల నుంచి ర్యాలీకి తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తే సహించబోమని ప్రభుత్వాలకు హెచ్చరిక
పట్నంబజారు (గుంటూరు) : రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎండగట్టింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశించిన సమసమాజ స్థాపనే ధ్యేయంగా పార్టీ శ్రేణులు ఉద్యమ కెరటాల్లా కదిలారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించేందుకు తామున్నామన్న విషయాన్ని చాటి చెప్పారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో గురువారం గుంటూరు నగరంలో నిర్వహించిన భారీ ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించింది.
తొలుత లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్క ర్ విగ్రహానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ప్రదర్శనను ప్రారంభించారు. శంకర్విలాస్ సెంటర్, ఓవర్బ్రిడ్జి, ఏసీ, హిందూ కళాశాలల మీదుగా సాగిన ప్రదర్శన చివరకు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరానికి చే రుకుంది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా పోటెత్తారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుంటూరు నగరానికి చేరుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగ ఫలాలు పేద ప్రజలకు అందకుండా, చట్టాన్ని వారికి అనుకూలంగా వాడుకుం టున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్నీతిని ఈ సందర్భంగా ఎండగట్టారు. స్వార్థ రాజకీయాల కోసం,స్వలాభం కోసం రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తే సహించబోమని పౌరుషాల పోతుగడ్డ గుంటూరు సాక్షిగా హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షకులు, ప్రజాస్వామ్య వాదులు, ప్రజా సంఘాల నేతలు భారీ ప్రదర్శనకు మద్దతుగా నిలిచారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మండల, గ్రామ అధ్యక్ష, కార్యదర్శలు, గుంటూరు నగర డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు, అనుబంధ విభాగాల నేతలు తరలివచ్చారు.
అంబేడ్కర్, జగ్జీవన్రామ్లకు నివాళి ...
ప్రదర్శన అనంతరం శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందు హిందూ కళాశాల కూడలిలోని బాబు జగ్జీవన్రామ్ విగ్రహానికి, సభ ప్రారంభం ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, షేక్ మొహమ్మద్ ముస్తఫా, ఉప్పులేటి కల్పన, శ్రీనివాసులు, పాలపర్తి డేవిడ్రాజు, నారాయణస్వామి, కంబాల జోగులు, గుంటూరు నగరాధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, బండారు సాయిబాబు, కావటి మనోహరనాయుడు, నియోజకవర్గాల సమన్వయకర్తలు రావి వెంకటరమణ, కత్తెర క్రిస్టీనా, అన్నాబత్తుని శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడు, పి. హనిమిరెడ్డి, కత్తెర సురేష్కుమార్, రాష్ట్ర కార్యద ర్శి ఎండీ నసీర్అహ్మద్, నాయకులు పోలూరి వెంకటరెడ్డి, నూనె ఉమామహేశ్వరరెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, సయ్యద్మాబు, కొత్తా చిన్నపరెడ్డి, యేళ్ళ జయలక్ష్మి, అంగడి శ్రీనివాసరావు, మాలె దేవరాజు, డైమండ్బాబు, మండేపూడి పురుషోత్తం, జెడ్పీటీసీలు కొలకలూరి కోటేశ్వరరావు, ఎన్ సునీత, నగర అనుబంధ విభాగాల నేతలు శ్రీకాంత్యాదవ్, మెట్టు వెంకటప్పారెడ్డి, ఆరుబండ్ల వెంకటకొండారెడ్డి, గనిక ఝాన్సీ, పల్లపు రాఘవ, షేక్ జానీ, పానుగంటి చైతన్య, మేరాజోతు హనుమంతనాయక్, నాగం కాశీ విశ్వనాథం, మార్కెట్బాబు, కోట పిచ్చిరెడ్డి, దాసరి కిరణ్, కొరిటిపాటి ప్రేమ్కుమార్, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, అత్తోట జోసఫ్, శిఖా బెనర్జీ, గోళ్ల శ్యామ్ముఖర్జీ, యరమాల విజయ్కిషోర్, నందేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
రగిలిన స్ఫూర్తి
Published Fri, Nov 27 2015 12:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement