రాజధాని గ్రామాల్లో సీపీఐ యాత్ర | Sakshi
Sakshi News home page

రాజధాని గ్రామాల్లో సీపీఐ యాత్ర

Published Tue, Oct 6 2015 10:53 AM

cpi praja chaitanya yatra in capital villages in guntur district

గుంటూరు: గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాజధాని గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలు, వృద్ధులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్లు పంపిణీ చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 11 న సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మధు హెచ్చరించారు.

Advertisement
Advertisement