ప్రజలకే కాదు తన మంత్రివర్గంలోని మంత్రులకు ఊహించని షాక్ లిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పటికే మంత్రులకు గ్రేడింగ్ ఇచ్చిన ఆయన మరో ఝలక్ ఇచ్చారు. మంత్రుల పేషీల్లో మీడియా అనుసంధాన అధికారి(ఎంఎల్ఓ)లను నియమించారు. 20 మంది టీడీపీ మద్దతుదారులను ఎంఎల్ఓలుగా నియమించేందుకు అధినేత పచ్చజెండా ఊపారు. ఇక మంత్రుల తరపున వీరే సమాచారం అందిస్తారు.
అధినేత నిర్ణయంపై కక్కలేక మింగలేక మంత్రులు సతమతమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది మంత్రులు పీఆర్వోలను నియమించుకున్నారు. తాము నియమించుకున్న పీఆర్వోలను కొనసాగిస్తారో, లేదో తెలియక తలపట్టుకుంటున్నారు. ఎంఎల్ఓ వ్యవహారం తమకు తలనొప్పిగా తయారవుతుందని అమాత్యులు వాపోతున్నారు. వచ్చే వారం నుంచి తమ పనితీరును రోజువారీగా 'ట్యాబ్'ల ద్వారా సీఎం అంచనా వేయనున్నారన్న గుబులు మరోపక్క మంత్రులను పీకుతోంది.
ఎంఎల్ఓలను 'చినబాబు' లోకేష్, ఆయన స్నేహితుడు, సీఎంఓ కార్యాలయం ఓఎస్డీ అభిష్ట ఎంపిక చేశారు(ట). మంత్రుల వ్యక్తిగత కార్యదర్శుల నియామకంలోనూ చక్రం తిప్పిన చినబాబు ఇప్పుడు కూడా కీలకపాత్ర పోషించారు. ఎంఎల్ఓలను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. వీరికి నెలకు రూ.20 వేల నుంచి రూ. 28 వేల వరకు వేతనం, ఇతర అలవెన్సులు చెల్లించనున్నారని సమాచారం. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మోయనుంది.
అయితే ప్రభుత్వంలో పనిచేసిన అనుభవంలేని వారిని ఎంఎల్ఓలుగా ఎలా నియమిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత కార్యదర్శుల నియామకంలో తమకెదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మంత్రులు కిమ్మనడం లేదు. తామెన్ని చెప్పినా చివరకు చినబాబు మాటే నెగ్గుతుందని తెలుసు కాబట్టి అమాత్యులు నోరు మెదపడం లేదు.
మంత్రులకు చంద్రబాబు మరో షాక్!
Published Fri, Sep 19 2014 2:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement