తుని రూరల్ :విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరం మండలం ఎస్.తిమ్మాపురం (అడ్డురోడ్డు) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి మేనేజరు పసలపూడి ఆంజనేయులు (49) హత్యకు గురయ్యారు. తుని మండలం తేటగుంట శివారు రాజులకొత్తూరు గ్రామం వెనుక చంటిరాజుగారి తోట వద్ద బుధవారం ఉదయం స్థానికులు ఒక మృతదేహాన్ని గుర్తించారు. వీఆర్వో రాజ్కుమార్ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలియడంతో తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, రూరల్ ఎస్సై ఎం.అశోక్, ఏఎస్సై భూషణం సంఘటనాస్థలానికి చేరుకున్నారు. రెండు చేతులు వెనక్కి కట్టి హత్య చేశారు. మృతుడి జేబులో ఉన్న ఆధార్, బ్యాంకు గుర్తింపు, పాన్కార్డు, ఓటరు గుర్తింపు కార్డులు ఆధారంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిగా గుర్తించారు.
గుర్తింపు కార్డుల్లో పేర్కొన్న వివరాలను బట్టి తాడేపల్లిగూడెంకు చెందిన వ్యక్తిగా భావించినప్పటికీ తునిలోని బ్యాంకు అధికారుల ద్వారా ఆంజనేయులు ఎస్.తిమ్మాపురం బ్రాంచి మేనేజరుగా పని చేస్తున్నట్టు తెలుసుకున్నారు. బంధువులకు సమాచారం అందించి, పోస్ట్మార్టం నిమిత్తం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆంజనేయులుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని, తునిలో నివాసం ఉంటూ రోజూ ఎస్.తిమ్మాపురం శాఖకు వెళ్లివస్తున్నారు. కాగా మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు బస్సు ఎక్కేందుకు అడ్డురోడ్డు బస్టాండ్లో ఉన్నట్టు సహ ఉద్యోగులు తెలిపినట్టు సీఐ తెలిపారు. మృతుడి స్వగ్రామం తాళ్లరేవు మండలం పటవల గ్రామమని సీఐ తెలిపారు. కాకినాడ నుంచి డాగ్ స్క్వాడ్ను రప్పించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ హత్య
Published Thu, Mar 26 2015 3:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement