జిల్లాలోని 13 చోట్ల 175 టెండర్లు
బరిలో ప్రముఖ కంపెనీలు, టీడీపీ నేతలు
రేపు విజయవాడలో ఈ-వేలం
విజయవాడ : జిల్లాలో ఇసుక రీచ్లు దక్కించుకునేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. బంగారు గనులను కొల్లగొట్టేందుకు ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు బినామీలను రంగంలోకి దింపినట్లు సమాచారం. జిల్లాలో 13 రీచ్లకు భారీగా టెండర్లు వేయించారు. ప్రధానంగా పెనమలూరు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో బినామీ టెండర్లు అధికంగా పడినట్లు చెబుతున్నారు. పలువురు నాయకులు తమ అనుచరుల పేర్లతో రంగంలోకి దిగారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు కూడా టెండర్లు వేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ కంపెనీలు కూడా ఇసుక వేలంలో బరిలోకి దిగినట్లు తెలిసింది. వీరంతా టీడీపీ నేతలతో జతకట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
వేలం బరిలో 175 మంది..
జిల్లాలో ఇసుక రీచ్లకు ఈ నెల 12న ఈ-వేలం నిర్వహించనున్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఇసుక రేవులకు వేలం జరుగుతుంది. 189 మంది టెండర్లను దాఖలు చేశారు. వీటిలో 14 టెండర్లను సాంకేతిక కారణాలతో అధికారులు తిరస్కరించారు. 175 మంది రంగంలో ఉన్నారు. ఇసుక రీచ్ల వేలానికి ప్రభుత్వం గత నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 5 వరకు టెండర్లు స్వీకరించారు. ఎం.ఎస్.టి.సి. (మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్) వెబ్సైట్లో ఇసుక వేలం దరఖాస్తులు రూపొందించారు. జిల్లాలోని 13 రీచ్ల్లో ఓపెన్ ఏరియాలో 8 రీచ్లు, డీసిల్టింగ్పై 5 రీచ్ల్లో వేలానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఓపెన్ ఏరియాలో అంటే న దీ తీరం (ఒడ్డున) పెదపులిపాక, మద్దూరు, చెవిటికల్లు, కంచల, పొక్కునూరు, కాసరబాద, అల్లూరుపాడు, శనగపాడులలో నిర్వహిస్తారు. డీసిల్టింగ్పై (నదీగర్భంలో) భవానీపురం, గొల్లపూడి, సూరాయపాలెం, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం రీచ్లకు వేలం నిర్వహిస్తారు. మంచి నాణ్యమైన ఇసుకగా పేరున్న కాసరబాద రీచ్కు అత్యధికంగా 22 టెండర్లు పడ్డాయి. గొల్లపూడి రీచ్కు 18, పెదపులిపాక, చెవిటికల్లు, గుంటుపల్లి రీచ్లు ఒక్కో దానికి 16 టెండర్లు పడినట్లు సమాచారం. ఈ- వేలం పాటలు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జేసీ గంధం చంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు.
నాయకుల ఒత్తిడి
పలు నియోజకవర్గాలలో టీడీపీ నాయకులు ప్రజాప్రతినిధులపై ఇసుక రీచ్ల సంఖ్య పెంచాలని ప్రజాప్రతినిధులపై ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి కొందరు ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాం గంతో ఇసుక రీచ్ల సంఖ్య పెంచే విషయమై చర్చలు జరుపుతున్నారు.
ఇసుక వేలానికి బినామీలు ‘రీచ్’
Published Thu, Feb 11 2016 12:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement