ఎమ్మెల్సీ'పై సీఈసీకి భన్వర్లాల్ లేఖ | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ'పై సీఈసీకి భన్వర్లాల్ లేఖ

Published Thu, Jul 31 2014 8:31 PM

ఎమ్మెల్సీ'పై సీఈసీకి భన్వర్లాల్ లేఖ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ లేఖ రాశారు. మండలిలో ఎమ్మెల్యే కోటాలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు అనుమతివ్వాలని కోరారు.

ఏపీ కౌన్సిల్‌లో 17కు గాను 15 మంది ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఆగస్టు 4న ఒక ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారని, మరో ఎమ్మెల్సీని కేటాయించాల్సి ఉందని సీఈసీకి రాసిన లేఖలో భన్వర్‌లాల్‌ వివరించారు.

Advertisement
Advertisement