తాడేపల్లిగూడెం : ఆదాయ మార్గాలను పెంచుకునే పనిలో నిమగ్నమైన రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువను పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ ఆదాయూన్ని పెంచుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఏటా ఆగస్ట్ 1న భూముల విలువను పెంచుకోవచ్చనే నిబంధనను ఆసరా చేసుకుని భూముల విలువ పెంపు నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించనుంది. దీనికి సంబంధించి మంగళవారం ఏలూరు, భీమవరం రిజిస్ట్రార్ జిల్లాల అధికారులతో చర్చలు జరిపి సమాచారం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న భూముల మార్కెట్ విలువపై 70 శాతం విలువను పెంచి ప్రభుత్వ ధరగా నిర్ణయించాలనే ఆలోచనకు అధికారులు వచ్చినట్టు సమాచారం. ఉదాహరణకు గజం స్థలం మార్కెట్ ధర ప్రకారం రూ.14 వేలు ఉంటే, ప్రభుత్వ ధర రూ.10 వేల వరకు ఉంటుంది. తాజా నిర్ణయం ప్రకారం ప్రస్తుతం రూ.10 వేల విలువ ఉన్న భూమి ధరను రూ.17 వేలకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇలా చేయడం వల్ల భూముల రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించే ఫీజు మొత్తం భారీగా పెరుగుతుంది. తద్వారా భారీ ఆదాయూన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. భూముల విలువను మదింపు చేయడానికి అనామలిస్ కమిటీ ప్రాంతాల వారీగా సమాచారం సేకరిస్తుంది. అనంతరం కనీస ధర, గరిష్ట ధర నిర్ణయిస్తుంది. దీని ప్రకారం తాడేపల్లిగూడెంలో ధరల మదింపు కమిటీకి జిల్లా జాయింట్ కలెక్టర్ చైర్మన్గా, సబ్ రిజిస్ట్రార్ కన్వీనర్గా, జిల్లా పరిషత్ సీఈవో, డీఆర్వో, మునిసిపల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. భూముల విలువకు పెంచే అంశానికి సంబంధించి ప్రాంతాల వారీగా ఇప్పటికే స్థానిక అధికారుల నుంచి సమాచారం సేకరించారు. రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ స్వయంగా భూములను పరిశీలించి ఆయా ప్రాంతాలలో ధరలను నిర్ణయిస్తారని సమాచారం.
మళ్లీ రిజిస్ట్రేషన్ బాదుడు
Published Wed, Jul 23 2014 2:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement