400 కేజీల గంజాయి పట్టివేత | Sakshi
Sakshi News home page

400 కేజీల గంజాయి పట్టివేత

Published Sun, May 3 2015 9:11 AM

400 కేజీల గంజాయి పట్టివేత

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం కొత్తకోట సమీపంలో పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 400 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు తుపాకీలతోపాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. నిందితులకు చెందిన రెండు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

Advertisement
Advertisement