దళితులపై దర్శి టీడీపీ అభ్యర్థి లక్ష్మి అక్కసు | Sakshi
Sakshi News home page

దళితులపై దర్శి టీడీపీ అభ్యర్థి లక్ష్మి అక్కసు

Published Sat, May 4 2024 10:30 AM

దళితులపై దర్శి టీడీపీ అభ్యర్థి లక్ష్మి అక్కసు

దర్శి: టీడీపీ ప్రచారంలో భాగంగా దేవవరం పంచాయతీలో గల తమ కాలనీకి రావాలని ఎస్సీకాలనీ వాసులు టీడీపీ అభ్యర్థి లక్ష్మీని ఆహ్వానించారు. లక్ష్మీ మాత్రం పల్లెలోకి రానని చెప్పి తిరస్కరించారు. దీంతో మీరు వస్తేనే ఓట్లేస్తాం.. లేకుంటే ఓట్లేయమని మహిళలు తేల్చి చెప్పారు. లక్ష్మి మాత్రం మీరు ఓట్లేయకపోతే పోండి.. నేను మాత్రం రానంటూ అసహనం వ్యక్తం చేసి వెనుదిరిగారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు తీవ్ర అవమానానికి గురయ్యారు. ఎన్నికల సమయంలోనే ఇలా ఉంటే.. ఇక మామూలు రోజుల్లో ఆమె ఎలా ఉంటారోనంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కట్టుబడిపాలెంలో కూడా నెలకొంది. లక్ష్మి ప్రచార రథం దిగకపోవడంతో అక్కడ కూడా ఇదే సీన్‌ రిపీట్‌ అయింది.

Advertisement
Advertisement