గత ఐదురోజులుగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని వణికిస్తున్న తుపాను హార్వీ మరింత విధ్వంసకరంగా మారుతోంది. బుధవారం నాటికి తుపాను సంబంధిత కారణాలతో మరణించిన వారి సంఖ్య 30కి చేరింది. వారిలో ఓ భారతీయ విద్యార్థి కూడా ఉన్నాడు. గురువారానికల్లా 150 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు అంటున్నారు. వరదలు తగ్గితే ఇంకా భారీ సంఖ్యలో మృతదేహాలు, మృతుల వివరాలు లభించే అవకాశం ఉందన్నారు. వరదలను అవకాశంగా తీసుకుని జరిగే దొంగతనాలు, నేరాలను నివారించేందుకు హూస్టన్ నగరంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కర్ఫ్యూ విధిస్తున్నారు. వరదలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వేలాది సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. హూస్టన్, సమీప ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు వరదలో చిక్కుకున్న 13 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు.
తెరపినివ్వని ‘హార్వీ’
Published Thu, Aug 31 2017 3:36 PM
Advertisement
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement