కాకినాడ బీచ్‌లో విషాదం | Sakshi
Sakshi News home page

కాకినాడ బీచ్‌లో విషాదం

Published Thu, Apr 6 2017 5:15 PM

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సూర్యారావుపేట బీచ్‌లో గురువారం విషాదం చోటుచేసుకుంది. విహార యాత్ర కాస్తా విద్యార్థుల కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. సముద్ర స్నానానికి వెళ్లి తొమ్మిదిమంది విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో అయిదు మృతదేహాలు బయటికి కొట్టుకువచ్చాయి. మరో ముగ్గుర్ని స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గల్లంతు అయిన మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement
Advertisement