డ్రగ్స్ కేసులో నోటీసులు అందాయి: నటుడు | Sakshi
Sakshi News home page

డ్రగ్స్ కేసులో నోటీసులు అందాయి: నటుడు

Published Fri, Jul 14 2017 11:19 AM

సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో తనకు నోటీసులు అందాయని టాలీవుడ్ హీరో నవదీప్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నోటీసులు వచ్చిన మాట నిజమే. పోలీసుల విచారణలో నేను పూర్తిగా సహకరిస్తాను. నేను ఏ తప్పు చేయలేదు. కానీ అకారణంగా ఊహాగానాలు వ్యాప్తిచేయడం బాధాకరం. కెల్విన్‌తో సంబంధాలు అంటున్నారు కానీ, ఆ కెల్విన్ ఎవరో నాకు నిజంగానే తెలియదు. మొత్తం సెలబ్రిటీలే చేశారంటూ ప్రచారం చేయడం వల్ల మాకు చాలా డామేజ్ జరుగుతుందని' నవదీప్ అన్నారు. చిన్నప్పుడు చేసిన తప్పులకు ఇప్పటికే నా జీవితం సాఫ్ట్ టార్గెట్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.