పారిస్ ఒప్పందానికి భారత్ ఆమోదం | Sakshi
Sakshi News home page

పారిస్ ఒప్పందానికి భారత్ ఆమోదం

Published Mon, Oct 3 2016 10:15 AM

గతేడాది పారిస్‌లో చేసుకున్న పర్యావరణ ఒప్పందానికి ఆదివారం భారత్ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేసిన ఒప్పందం ఆమోద ప్రతిని ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ యూఎన్ ఒప్పందాల విభాగ చీఫ్ విల్లపాండోకు అందజేశారు. మహాత్మాగాంధీ 147వ జయంతి సందర్భంగా యూఎన్ అధికారులు, దౌత్యవేత్తలతో కలసి ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దీన్ని అందించారు.

Advertisement
Advertisement