టెలీకాలర్‌ హత్య కేసు: సంచలన నిజాలు | Sakshi
Sakshi News home page

టెలీకాలర్‌ హత్య కేసు: సంచలన నిజాలు

Published Sat, Feb 18 2017 7:47 AM

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ భాగ్యనగర్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీలో దారుణ హత్యకు గురైన టెలీకాలర్‌ సునీత హత్య కేసును సైబరాబాద్‌ పోలీసులు వెంటనే ఛేదించారు. ఆమె సన్నిహితుడే హంతకుడిగా గుర్తించారు. అతను మరో స్నేహితుడితో కలసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వారి కోసం గాలింపు చేపట్టారు. అయితే ఈ నిందితుల వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు