పార్టీ నేతలకు చంద్రబాబు వార్నింగ్! | Sakshi
Sakshi News home page

పార్టీ నేతలకు చంద్రబాబు వార్నింగ్!

Published Sun, Feb 19 2017 7:36 AM

అనంతపురం జిల్లా టీడీపీ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని, బహిరంగ విమర్శలు చేస్తే క్షమించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లా టీడీపీ నేతలతో శనివారం చంద్రబాబు సమావేశమయ్యారు. కదిరి, రాప్తాడులో పార్టీలో వర్గపోరుపై ఆయన దృష్టి సారించారు. ఎమ్మెల్యే చాంద్ బాషా, కందికుంట వెంకటప్రసాద్ లు పార్టీ అధినేత చంద్రబాబు ఎదుటే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.