విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ లో పనిచేసే పద్మ, ఆమె కుమారుడు నరేంద్ర సోమవారం ఉదయం బైక్పై వెళ్తుండగా శంకర్ అనే వ్యక్తి వారిపై కత్తితో దాడి చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో తల్లీ,కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా కుమారుడు మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. పద్మతో గతంలో శంకర్ కు సన్నిహిత సంబంధాలు ఉండేవని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల వీరిమధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని, అవే హత్యాయత్నానికి దారి తీసి ఉంటాయని అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
తల్లి, కుమారుడిపై కత్తితో దాడి
Published Mon, Mar 13 2017 2:53 PM
Advertisement
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement