ప్రముఖ దర్శకుడు రాంగోపాల్వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘వంగవీటి’ సినిమా న్యాయ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాను వాస్తవాలకు విరుద్ధంగా రూపొందించారని, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఆమోదం లేకుండా సినిమా ట్రైలర్, టీజర్లను ఇంటర్నెట్, యూట్యూబ్, ట్వీటర్లలో ప్రదర్శిస్తున్నారంటూ వంగవీటి రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రరుుంచారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్కుమార్లకు నోటీసులు జారీ చేస్తూ దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
న్యాయ వివాదంలో ‘వంగవీటి’ సినిమా
Published Thu, Dec 1 2016 7:47 AM
Advertisement
Advertisement