మాల్యాకు మరోసారి సుప్రీం నోటీసులు | Sakshi
Sakshi News home page

మాల్యాకు మరోసారి సుప్రీం నోటీసులు

Published Mon, Jul 25 2016 3:35 PM

వేల కోట్ల రూపాయల బ్యాంకుల రుణ ఎగవేత దారుడు, మద్యం వ్యాపారి విజయ మాల్యాకు సుప్రీంకోర్టు సోమవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. పూర్తి ఆస్తుల వివరాలను అందించికపోవడంపై ఆగ్రహించిన కోర్టు మాల్యాకు మరోసారి కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఆస్తుల వివరాల వెల్లడిపై బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన ధిక్కార పిటిషన్ పై స్పందించిన సుప్రీం తాజా నోటీసులిచ్చింది. స్థిర చర ఆస్తుల వివరాలను ప్రకటించాలన్న ఆదేశాలు బేఖాతరుపై బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారించింది.