ఐటీ దిగ్గజాలకు రానున్నది గడ్డుకాలమేనట! | Sakshi
Sakshi News home page

ఐటీ దిగ్గజాలకు రానున్నది గడ్డుకాలమేనట!

Published Tue, Oct 11 2016 10:56 AM

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఐటీ రంగంపై ఐటీ నిపుణులు మరో బాంబు పేల్చారు. ముఖ్యంగా ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంత ఘోరమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా బలంగా ఉండే క్యూ-2 ఫలితాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండవ త్రైమాసికంలో నిరాశాజనకంగా ఉండనున్నాయని వెల్లడించారు.