రేపట్నుంచి బడ్జెట్‌ సమావేశాలు | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి బడ్జెట్‌ సమావేశాలు

Published Tue, Jan 30 2024 6:12 AM

Parliamentary Affairs Minister to meet Floor Leaders of Political Parties in Parliament on 30th January - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉభయ సభల్లోని పారీ్టల ఫ్లోర్‌ లీడర్లతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి భేటీ అవుతారు.

సమావేశాలు ఫిబ్రవరి 9 దాకా కొనసాగుతాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెడతారు.

Advertisement
Advertisement