నాడు–నేడుకు దేశం ఫిదా | Sakshi
Sakshi News home page

నాడు–నేడుకు దేశం ఫిదా

Published Thu, Apr 25 2024 4:34 PM

Every state in country should take Andhra Pradesh as inspiration

వెల్లువెత్తుతున్న ప్రశంసలు 

వీడియోలు పోస్టు చేస్తున్న ఉత్తరాది సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విద్యా వ్యవస్థలో సీఎం జగన్‌  ప్రవేశపెట్టిన నాడు–నేడుతో పాఠశాలల రూపు­రేఖలు మారిపోతున్నాయి. ఆ అంశం యావ­త్‌ దేశా­న్ని ఆకర్షిస్తోంది. నాడు–నేడు ద్వారా బడుగు, బలహీన వర్గాల పిల్లలకు పెద్దపీట వేయడాన్ని ఉత్తరాది రాష్ట్రాలు కొనియాడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల పరిస్థితులు, ప్రస్తుతం సీఎం జగన్‌ హయాంలో పాఠశాలల స్థితిగతులపై సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కళ్లకు కట్టినట్లు వీడియోలు రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. నాడు–నేడు షార్ట్‌ వీడియోలు ట్రెండీగా మారాయి. ఏపీలోని నాడు–నేడుపై దేశవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. 

► రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు విద్యాసంస్థలను పట్టించుకోలేదు. 
► విద్య, మధ్యాహ్న భోజన విషయంలో సైతం సర్కారీ బడులపై బాబు చిన్నచూపు చూశారు. 
► 2014–19 మధ్య దాదాపు 1,785 పాఠశాలలను మూసివేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది.
► 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక మెజార్టీ సీట్లతో గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 58 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్లతో 45 వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. 
► 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో..సీఎం జగన్‌ అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో పలువురి కామెంట్లు ఇలా..
► ఇది కేవలం విజనరీ సీఎం జగన్‌ వల్లే సాధ్యం
►  నాకు ఆంధ్రప్రదేశ్‌ స్కూల్స్‌ అంటే ఇష్టం.. మంచి విద్య, అద్భుతమైన ఆట స్థలాలు 
► అవును ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కూడా విద్యార్థులకు అవసరమే
► దేశంలో ప్రతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ని స్ఫూర్తిగా తీసుకోవాలి
►  ఏపీ సీఎం జగన్‌ కింగ్‌ 

ట్రెండింగ్‌లో కావ్య వీడియో
సీఎం జగన్‌ విద్యా వ్యవస్థలో నాడు–నేడు ద్వారా తీసుకొచి్చన విప్లవాత్మక మార్పులను గుర్తిస్తూ ఢిల్లీకి చెందిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ‘కావ్య’ ఓ వీడియోను రూపొందించారు. 
►విద్యా వ్యవస్థలో దేశంలోనే ఏపీ సరికొత్త అడుగులు వేసిందని, గతంలో ఉన్న అధ్వాన పరిస్థితిని సమూలంగా మార్చివేసిందంటూ ప్రశంసలు కురిపించారు. 
►అత్యాధునిక ఫర్నిచర్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేశారని.. ఆ రోజుల్లో మనకు ఇటువంటి సౌకర్యాలు లేవే అంటూ.. సీఎం జగన్‌ చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

►ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టి, ఐబీ సిలబస్‌ను పరిచయం చేయడం అభినందనీయమని, ఈ ఐదేళ్ల కాలంలో ఏపీలో నిరక్షరాస్యత తగ్గిందని, బడుగు, బలహీన వర్గాల వారికి చదువుపై ఆసక్తి పెరిగిందంటూ వీడియో చేశారు. 
►ఆ వీడియోను యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేయడంతో పదిలక్షలకు పైగా నెటిజన్లు వీడియో చూసి, వేల సంఖ్యలో షేర్‌ చేస్తూ ‘సూపర్‌ ఏపీ స్కూల్స్‌’ అంటూ కితాబు ఇస్తున్నారు. 

►మరికొంత మంది నాడు–నేడుపై షార్ట్‌ వీడియోస్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. ఉత్తరాది జనం ఫిదా అవుతున్నారు. 
►యూపీ, హరియాణా, రాజస్థాన్, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో ఈ తరహా విద్య ఉంటే బాగుంటుందంటూ కామెంట్ల రూపంలో వారి అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. 
►దేశవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ ఇదే తరహా నాణ్యమైన విద్య దేశం మొత్తం తీసుకురావాలని, సీఎం జగన్‌ను కొనియాడుతూ లైకులు, కామెంట్లు, షేర్‌ చేస్తున్నారు. 

Advertisement
Advertisement