-
యూత్ కాంగ్రెస్ ‘నారాజ్’
సాక్షి, హైదరాబాద్: టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరితో యూత్ కాంగ్రెస్ నాయకత్వం నారాజ్ అవుతోంది. ప్రతి ఎన్నికల్లోనూ యూత్ కోటాలో 3–7 టికెట్లు కేటాయిస్తారని, కానీ ఈసారి మాత్రం తమను పరిగణనలోకి తీసుకోకపోవడంతో యూత్ కాంగ్రెస్ నేతలు నైరాశ్యంలో మునిగిపోతున్నారు. ఇందుకు నిరసనగా యూత్కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలని భావిస్తున్నారు. ఈసారి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి వనపర్తి టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ వనపర్తి కాకపోయినా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండేళ్లుగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక పోరాటా లు చేసి విద్యార్థులు, యువత పక్షాన నిలబడ్డామని, ఈ ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. తద్వారా యువకులకు పార్టీ ప్రాధాన్యతమిస్తుందనే సంకేతాలను పంపాలని చెబుతున్నారు. వనపర్తితో పాటు దేవరకొండ, అంబర్పేట లాంటి సీట్లను తమకు కేటాయించాలని యూత్ కాంగ్రెస్ నేతలు కోరుతున్న నేపథ్యంలో అధిష్టానం ఏం చేస్తుందో వేచిచూడాల్సిందే. నేడు ‘బుజ్జగింపు’ భేటీ? యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్లో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణ యించారు. అయితే, చాలామంది యూత్కాంగ్రెస్ నేతలు నిరాశలో ఉన్న మాట వాస్తవమేనని, వారందరూ రాజీనామాలు చేయాలనే భావనలో ఉన్నప్ప టికీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్లోనే ఉంటారని, వారిని బుజ్జగించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారనే చర్చ జరుగుతోంది. -
కుర్చీలతో వీరంగం చేసిన కాంగ్రెస్ నేతలు.. వీడియో వైరల్
ముంబై: ముంబైలో జరిగిన యూత్ కాంగ్రెస్ మీటింగులో మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కునాల్ నితిన్ రౌత్ మద్దతుదారులకు వ్యతిరేక వర్గానికి మధ్య వివాదం చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్ ముందే కుర్చీలు విసురుకుంటూ దాడులకు దిగారు. దీంతో బి.వి.శ్రీనివాస్ సభలో ఏమీ మాట్లాడకుండానే అక్కడినుండి వెళ్లిపోయారు. చాలాకాలంగా మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కునాల్ నితిన్ రౌత్ ను ఆ బాధ్యతల నుండి తప్పించమని ఒక వర్గం కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంది. మరో వర్గం మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తూ వస్తోంది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య సమన్వయాన్ని కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది మహారాష్ట్ర కాంగ్రెస్. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా యూత్ కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటుచేసింది అధిష్టానం. తీరా చూస్తే ఈ రెండు వర్గాలు ఆ వేదికను రణరంగంలా మార్చి పరస్పర దాడులకు తెగబడ్డారు. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్ ముందే కుర్చీలు విసురుకుంటూ వీరంగం సృష్టించారు. దీంతో బి.వి.శ్రీనివాస్ సభలో మాట్లాడకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. BREAKING: A meeting of the Youth Congress in a fight between two groups over the demand to remove Maharashtra Youth Congress chief Kunal Nitin Raut.pic.twitter.com/AWW7qhF2fP — ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) June 17, 2023 ఇది కూడా చదవండి: ఎన్నికలకు ఫార్ములా రెడీ చేశాం, ఇక రంగంలోకి దూకడమే.. -
టీ కాంగ్రెస్లో సొంత నేతలపైనే ట్రోలింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో ఇంటి దొంగల కదలికలు బయటపడుతున్నాయా?. సొంత నేతలను, అదీ సీనియర్లను బద్నాం చేసే కుట్రలు జరుగుతున్నాయా? సోషల్ మీడియాలో ట్రోలింగ్ రగడ వెలుగుచూసిన తరుణంలో ప్రస్తుతం ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. తనతో పాటు ఇతర నాయకులపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. తనపైనా, ఓ సీనియర్పైనా వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ మే 5వ తేదీన ఉత్తమ్కుమార్ పోలీసులను ఆశ్రయించారు. ఒక నెంబర్ నుంచే ఈ ట్రోలింగ్ జరుగుతోందని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో ఆ నెంబర్ భీమవరానికి చెందిన ఓ మహిళ పేరు మీద ఉందని గుర్తించారు. కానీ, ఆ నెంబర్ వాడిన లొకేషన్ మాత్రం ఉత్తమ్ ఇంటి సమీపంలోనే ఉంది. ఉత్తమ్ ఇంటి సమీపంలోని ఓ ప్లాట్ నుంచి ఈ తతంగం నడిచినట్లు పోలీసులు గుర్తించారు. చివరకు ఆ ప్లాట్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ పేరు మీద ఉండడం, ఆ విభాగపు ఇంఛార్జి జయల ప్రశాంత్ తన టీంతో ఈ వ్యవహారం అంతా నడిపించినట్లు పోలీసులు ధృవీకరించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ వార్రూమ్లో సోమవారం పోలీసులు సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లు, డేటా సేకరించారు. ఐదు కంప్యూటర్లను, హార్డ్ డిస్క్లను సీజ్ చేశారు. ప్రశాంత్పై కేసు నమోదు మరోవైపు భట్టి విక్రమార్క ఇంట్లో జరిగిన సేవ్ కాంగ్రెస్ మీటింగ్లో కూడా ఆయన.. తనపైనా ఇదే తరహా ప్రచారం జరుగుతోందని అనుమానాలే వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ అనుమానాలు నిజం అయ్యాయి. తమ విచారణలో ప్రశాంత్ నేతృత్వంలో ఈ యాంటీ క్యాంపెయిన్ జరిగిందని సీసీఎస్ పోలీసులు తేల్చారు. అనుచిత పోస్టులతో ట్రోలింగ్కు పాల్పడినందుకుగానూ ప్రశాంత్తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రేపు(బుధవారం) విచారణకు తమ ఎదుట హాజరుకావాలని సీసీఎస్ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రశాంత్పై వేటు.. ఉత్తమ్కుమార్తో పాటు జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క్, మరికొందరు నేతలపైనా ఈ ట్రోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో అనుచిత పోస్టలు చేసినందుకుగానూ ప్రశాంత్పై పార్టీ వేటు వేసింది. అయితే.. ఈ పరిణామంపై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివనసేనారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎవరో ఒకరు ట్వీట్ చేస్తే.. వార్రూమ్పై దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారాయన. ఈ వ్యవహారం ఇక్కడితోనే చల్లారుతుందా? లేదంటే ఇంకా ఎక్కడిదాకా అయినా వెళ్తుందా? అనే వేచిచూడాలి. -
భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. యువజన నేతపై దాడితో ఉద్రిక్తతలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: హనుమకొండలో యువజన కాంగ్రెస్ నాయకుడు తోట పవన్పై దాడి ఉత్కంఠ, ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ దాడిని నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. దాడిలో గాయపడ్డ పవన్ను హనుమకొండలోని ఏకశిల ఆస్పత్రిలో మంగళవారం పరామర్శించిన రేవంత్ రెడ్డి.. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా పోలీస్ కమిషనరేట్కు చేరుకున్నారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ కమిషనరేట్ ముందు బైటాయించి ధర్నా చేశారు. ఎమ్మెల్యే వినయ్భాస్కర్పై హత్యా నేరం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ని రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. చట్టపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారు. ‘దాస్యం దద్దమ్మ’ ఫ్లెక్సీతోనే వివాదం.. రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర ఓరుగల్లులో అలజడి సృష్టించింది. హనుమకొండలో సోమవారం రాత్రి జరిగిన పాదయాత్ర, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో స్థానిక ఎమ్మెల్యేపై విడుదల చేసిన చార్జిషీట్తో ‘దాస్యం దద్దమ్మ’ ఫ్లెక్సీని యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ ప్రదర్శించారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ముగియగానే దారికాచి పవన్పై దాడి చేశారు. తీవ్రగాయాలతో పవన్ స్పృహతప్పి పడిపోవడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కొద్ది గంటలకు స్పృహలోకి వచ్చిన పవన్ తనను హతమార్చేందుకే బీఆర్ఎస్కు చెందిన రంజిత్ రెడ్డి, రాజ్కుమార్, అభిలతోపాటు సుమారు 15 మంది దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ అపోలోకు పవన్.. పోలీసుల అదుపులో ఐదుగురు...? పవన్ ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించాలని డాక్టర్లు సూచించారు. ఈ మేరకు హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా సీపీ రంగనాథ్ ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్న ప్రత్యేక బృందాలు పవన్పై దాడి ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలకు వివరించారు. చట్టపరంగా విచారణ జరిపి త్వరలోనే నిందితులందరినీ గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు రేవంత్ రెడ్డి పిలుపు.. పోలీస్ కమిషనరేట్ ఎదుట రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దాడి వెనుక ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. హత్యాయత్నం చేసిన బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను సీజ్ చేయాలని, రక్త నమూనాలు సేకరించి గంజాయి మత్తు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. దాడులతో రాజకీయం చేయాలంటే డేట్ డిసైడ్ చేయండంటూ సీఎం కేసీఆర్కు రేవంత్ సవాల్ విసిరారు. పాదయాత్ర దగ్గర దాడి అంటేనే... కాంగ్రెస్ పార్టీపై, నేతలపై జరిగిన దాడిలా చూడాలని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ విభాగాలు ఈ దాడిని సీరియస్గా తీసుకుని గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో నిరసన, ధర్నాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. చదవండి: బెల్ట్ షాపులుంటే బట్టలూడదీసి బొక్కలో వేయిస్తా.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు -
ప్రగతిభవన్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతల యత్నం
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement