-
యాత్రను జయప్రదం చేయండి : ఎడ్మ కిష్టారెడ్డి
కల్వకుర్తి: సోమవారం నుంచి జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర ఆరంభమవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన కల్వకుర్తిలో విలేకరులతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మృతికి తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిలయాత్ర చేస్తున్నారని వివరించారు. జిల్లాలో ఐదురోజుల పాటు పది నియోజకవర్గాల్లో జరిగే ఈ యాత్రలో 21 మంది బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దివంగత రాజశేఖరరెడ్డి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేస్తారని తెలిపారు. యాత్రకు అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. ఉదయం 11గంటలకు.. ముందుగా మాడ్గుల మండలం కుర్మేడు గ్రామం మీదుగా కొత్త బ్రాహ్మణపల్లికి విచ్చే సి అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం రెడ్డిపురం గ్రామంలో జె.రాయపురెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. 12.30 గంటలకు ఆమనగల్లుకు చేరుకుని అంబేద్కర్, రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి కడ్తాలకు చేరుకుంటారని ఎడ్మ వెల్లడించారు. అక్కడి నుంచి సాయంత్రం 4.30 గంటలకు దేవుని పడకల్కు చేరుకుని మృతిచెందిన తుమ్మల నర్సింహా కుటుంబాన్ని, వెల్జాల గ్రామంలో మృతిచెందిన అంజనమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారని ఆయన పేర్కొన్నారు. అక్కడి నుంచి మిడ్జిల్ మండల కేంద్రం నుంచి కల్వకుర్తి పట్టణానికి సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేస్తారని చెప్పారు. మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు కల్వకుర్తి నుంచి అమ్రాబాద్కు చేరుకుంటారని తెలిపారు. ఆమె వెంట పార్టీ తెలంగాణ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులే టి శ్రీనివాస్రెడ్డి, గట్టు రాంచంద్రరావు, శివకుమార్, జనక్ప్రసాద్, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, నల్లారి సూర్యప్రకాష్రావు, అబ్దుల్ రహమాన్, కొండ రాఘవరెడ్డి, శ్రీకాంత్రెడ్డి తదితరులు రానున్నారని తెలిపారు. పరామర్శయాత్రను ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయాలని ఎడ్మ కిష్టారెడ్డి కోరారు. -
తెలంగాణకు వైఎస్ఆర్ సీపీ ప్రత్యేక కమిటీ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేక కమిటీని ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించినట్టు వైఎస్ఆర్ సీపీ వెల్లడించింది. ఈ కమిటీలో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎడ్మ క్రిష్ణారెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, నల్లా సూర్యప్రకాశ్, కె శివకుమార్, గట్టు రాంచంద్రరావు, గట్టు శ్రీకాంత్రెడ్డి, కొండా రాఘవరెడ్డి, అబ్దుల్ రెహమాన్, జనక్ ప్రసాద్ లను సభ్యులుగా నియమించినట్టు తెలిపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement