-
బ్లడ్ గేమ్ బై సునీత.. తండ్రి రక్తంతో కూతురు కుటిల రాజకీయం
రక్తం ప్రశ్నిస్తోంది.. అవును రక్తం ప్రశ్నిస్తోంది. రక్త సంబంధం ఉన్న కూతురిని ప్రశ్నిస్తోంది. చంద్రబాబు ఆడుతున్న బ్లడ్ గేమ్లో నువ్వెందుకు పావులా మారావని ప్రశ్నిస్తోంది. యస్.. వివేకా రక్తం కూతురు సునీతను ప్రశ్నిస్తోంది. నా రాజకీయ ప్రత్యర్థులతో నువ్వు, నీ భర్త ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నిస్తోంది. నన్ను గొడ్డలితో కసితీరా నరికి నరికి చంపిన దస్తగిరి బయట తిరుగుతుంటే.. నువ్వు బస్సెక్కి షర్మిల వెంట ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నిస్తోంది. నన్ను చంపినోడు బెయిల్పై బయట తిరుగుతుంటే.. అతడ్ని జైల్లో పెట్టించకుండా.. జగన్కు ఓటేయొద్దు.. అవినాష్కు ఓటేయొద్దు అంటూ ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నిస్తోంది. నా రక్తపు మరకల తడి ఆరక ముందు అన్నీ నిజాలే చెప్పిన నువ్వు.. ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నావని నీ అంతరాత్మకు తెలుసు. నీ పక్కనే అసలు హంతకులు ఉన్నారని నీ అంతరాత్మకు తెలుసు. వారిని కాపాడుకునేందుకు అవినాష్కు ఆ రక్తపు మరకలు పూసే ప్రయత్నం చేస్తున్నావని నీ అంతరాత్మకు తెలుసు. ఎందుకమ్మా అన్ని తెలిసి ఈ బ్లడ్ గేమ్ లో నా ప్రత్యర్థుల వైపు నిలబడ్డావ్.. అని వివేకా రక్తం తన రక్త సంబంధమైన సునీతను ప్రశ్నిస్తోంది. హత్య చేసినోడు ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తాడు. హత్య చేయించినోడు ఇంట్లోనే నీ పక్కనే తిరుగుతుంటాడు. ఎంటమ్మా సునీత ఇది.. పదేళ్లలో ఎప్పుడైనా నాన్నా అని ఆప్యాయంగా పిలిచావా ? ఇప్పుడు నా రక్తాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నావే.. ఇది కరెక్టేనా ? నా రెండో భార్య షమీమ్ ను నువ్వు హింసించినా.. అవమానించినా.. నేను నిన్నేమీ అనలేదే..ఓహో ఆస్తిలో వాటా తగ్గుతుందని నా తర్వాత హోదా, పదవి నీ భర్తకు దక్కవని కోపంతో ఉన్నావా ? అందుకే నా ప్రత్యర్థుల వైపు నిలబడ్డావా ? జగన్ కు ఓటేయొద్దని అంటున్నావా ? అమాయకుడైన అవినాష్ ను బలి పశువుని చేయాలని చూస్తున్నావా ? అని వివేకా రక్తం తన రక్త సంబంధమైన సునీతను ప్రశ్నిస్తోంది. మర్డర్ చేయడమే కాదు.. దాన్ని ఇంకొకరిపై నెట్టేసే కుట్రపై.. ఇదే రక్తం సాక్షిగా.. అనేక ప్రశ్నలు తిరుగుతున్నాయి.. ప్రధానంగా ఓ పది ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. 1. వివేకా రెండో భార్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన కాలర్ పట్టుకుని బెదిరించింది నీ భర్త కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 2. వివేకా రెండో భార్య కొడుక్కి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని రక్త చరిత్రకు తెరలేపింది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 3. వివేకాకు చెక్ పవర్ తీసేసి ఆర్థికంగా ఆయనకు చెక్ పెట్టింది నువ్వు, నీ భర్త నర్రెడ్డి కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 4. తండ్రి బతికుండగా పట్టెడన్నం పెట్టని నువ్వు ఇప్పుడు దొంగ ప్రేమ ఒలకబోస్తున్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 5. వివేకా రాజకీయ శత్రువులైన బీటెక్, ఆదినారాయణ రెడ్డి సహకారంతోనే హత్య జరిగిందని చెప్పింది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 6. హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖను దాచి పెట్టమని పీఏ కృష్ణారెడ్డికి చెప్పింది నీ భర్త కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 7. అవినాష్ పేరు చెప్పకపోతే.. నీ భర్త జైలుకు పోక తప్పదని పీఏ కృష్ణారెడ్డితో అన్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 8. వివేకాను తానే నరికి చంపానని చెప్పినా.. దస్తగిరి బెయిల్కు నువ్వు సహకరించింది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 9. వివేకా హంతకులు పక్కనే ఉన్నా.. రక్తపు మరకలు మరొకరికి పూయాలని ప్రయత్నిస్తున్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 10. నీ ఇంట్లో వారిని రక్షించుకునేందుకే చంద్రబాబు సపోర్ట్ తీసుకుని రాజకీయం చేస్తున్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు -
ఓర్నీ ఏశాలో!.. నారా వారి ‘మడత’ రాజకీయం
నాలికను ఎటు కావాలంటే అటు వైపు మడత పెట్టడం కూడా ఒక ఆర్టే. అందులో చంద్రబాబు నాయుణ్ని మించిన ఆర్టిస్ట్ ఈ దేశంలోనే మరొకరు ఉండరు. పొద్దున్న తిట్టిపోసిన వ్యక్తినే మధ్యాహ్నం పొగిడేయగలరు. సాయంత్రానికల్లా అదే వ్యక్తిని మళ్లీ తిట్టనూగలరు. అంత ఫ్లెక్సిబుల్ నాలికలు ఉండడం చంద్రబాబు ప్రత్యేకతే అంటారు రాజకీయ పండితులు. అభిప్రాయాలను కూడా అలానే మార్చేస్తారు. తాను చేసిన వ్యాఖ్యకి పూర్తి భిన్నమైన వాదనను ఆయనే వినిపిస్తారు. దానికి ఏదో ఒక సాకు చెబుతారు. నలుగురూ నవ్విపోతారేమో అన్న సిగ్గుకూడా లేకుండా ఎంచక్కా నిర్లజ్జగా చంద్రబాబు నడుచుకుపోతారని ఆయనంటే గిట్టని వాళ్లు అంటూ ఉంటారు. 2019 ఎన్నికలకు ఇంచుమించు ఏడాది ముందు ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుని తిట్ల దండకం అందుకున్నారు. మోదీ దుర్మార్గ విధానాల వల్లనే దేశం నాశనమైందన్నారు. అందుకే దేశాన్ని కాపాడుకోడానికి తాను కాంగ్రెస్తో జట్టు కట్టి విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు దేశంలోనే సీనియర్ నాయకుడైన తాను ప్రయత్నిస్తున్నట్లు అప్పట్లో చెప్పుకొచ్చారు ఈ క్రమంలో చంద్రబాబు దిక్కుమాలిన సిగ్గుమాలిన రాజకీయానికి తెరతీశారు. ఏ కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి టీడీపీ పుట్టిందో అదే టీడీపీని తీసుకెళ్లి కాంగ్రెస్ కాళ్ల దగ్గర పెట్టేశారు. రాహుల్ గాంధీకి ఓ బొకే ఇచ్చి వెచ్చగా ఉంటుందని ఓ శాలువా కప్పి ఫోటోకోసం ఓ నవ్వు నవ్వి అదే చాణక్యం అన్నట్లు తన పత్రికల్లో రాయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఏంటి? కాంగ్రెస్తో చేతులు కలపడం ఏంటి? ఏమన్నా సిగ్గుందా లేదా అని టీడీపీ సీనియర్లు కుతకుత లాడిపోయినా.. చంద్రబాబు పట్టించుకోలేదు. కాంగ్రెస్తో జట్టు కట్టడంపై విమర్శలు వెల్లువెత్తడంతో తన అవకాశవాద దిగజారుడు రాజకీయానికి ఓ ముద్దు పేరు పెట్టారు చంద్రబాబు. డెమొక్రటిక్ కంపల్షన్ తోనే కాంగ్రెస్తో కలిశామన్నారు. చక్రాలు తిప్పడం తనకు అచ్చొచ్చిన ఆర్ట్ అని తన మీడియా ద్వారా ప్రచారం చేయించుకుని పొంగిపోయారు. ఆ సమయంలోనే కర్ణాటక ఎన్నికలు జరిగితే.. తానే అక్కడ బీజేపీని ఓడించానని భవిష్యత్తులో కూడా ఓడిస్తానని బీరాలు పలికారు నారా గిరీశం. 2019లో దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించి బీజేపీ వ్యతిరేక కూటమిని గెలిపించుకుంటామన్నారు. నరేంద్ర మోదీని ఓడించి ఇంటికి పంపేస్తామన్నారు. 2018లో చంద్రబాబు ఎన్డీయే నుండి బయటకు వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వంపైనా మోదీపైనా విరుచుకుపడుతూ వచ్చారు. అంత వరకు ప్రత్యేక హోదాను పక్కన పెట్టిన చంద్రబాబు హోదా కోసం ధర్మపోరాట దీక్ష అంటూ కొత్త డ్రామాకి తెరతీశారు. తాను ఎన్డీయేలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి పోరాడిన వారిని జైలుకు పంపించారు చంద్రబాబు.నాలుగేళ్ల పాటు మౌనంగా ఉన్న చంద్రబాబు బీజేపీకి దూరం అయ్యాక అమరావతి రాజధానికి నరేంద్ర మోదీ కేవలం 1500 కోట్లు మాత్రమే ఇచ్చారని అది అక్కడ కేబుల్కి కూడా సరిపోదని అన్నారు. నరేంద్ర మోదీ కన్నా చాలా ముందుగానే తాను ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. రాజకీయాల్లో దేశంలోనే తాను సీనియర్ని అని చెప్పుకున్నారు. తనకంటే సీనియర్లు అయిన మల్లికార్జున ఖర్గే, కరుణానిధి వంటి వారు కూడా ఉన్నారని మర్చిపోయారు చంద్రబాబు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నారు చంద్రబాబు. హోదా కన్నా ప్యాకేజీతోనే ఎక్కువ లాభమని విచిత్ర వాదన చేశారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని చెప్పి కేంద్ర మంత్రులకు సన్మానం కూడా చేశారు. అదేదో ఘనత సాధించినట్లు వారిని కీర్తించారు. ఎన్డీయే నుండి బయటకు రాగానే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తోన్న హోదా ఉద్యమానికి జంకి తాను కూడా హోదా గురించి మాట్లాడ్డం మొదలు పెట్టారు. ఆక్రమంలోనే మోదీని విమర్శించారు. -సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్ట్ ఇదీ చదవండి: రఘురామా.. ప్లీజ్ గెటవుట్! -
బాబోయ్.. ఇదేం ఖర్మరా!.. బాబు డొల్ల మాటలు.. ఇవీ వాస్తవాలు
సాక్షి, అమరావతి: కళ్లార్పకుండా అబద్ధాలు.. నిస్సిగ్గుగా బుకాయింపు! ఏలూరు జిల్లాలో బుధవారం పర్యటించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గోబెల్స్ను తలదన్నే రీతిలో అంతులేని అబద్ధాలాడారు. యథాప్రకారం హైదరాబాద్ను తానే నిర్మించానని.. సెల్ఫోన్నూ తానే కనిపెట్టానంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఆయన తీరు చూస్తుంటే ఇదేం ఖర్మరా.. అని అంతా అనుకోవాల్సిందే మరి! 1. మేనిఫెస్టో మాయం.. చంద్రబాబు: కేవలం ఆరు పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేస్తున్నామంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా గొప్పలు చెప్పుకున్న సీఎం జగన్ ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. వాస్తవం: అధికారంలోకి వచ్చాక మూడున్నరేళ్లలోనే 98 శాతం హామీలను అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు సీఎం జగన్ సిసలైన నిర్వచనం చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటివరకూ రూ.1,77,585.51 కోట్లు అందచేశారు. దేశ చరిత్రలో డీబీటీ రూపంలో ఈ స్థాయిలో పేదల ఖాతాల్లో నిధులు జమ చేయడం ఇదే ప్రథమం. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో మొత్తం రూ.3,19,227.86 కోట్ల మేర పేదలకు ప్రయోజనం చేకూర్చారు. ఇది పేదరిక నిర్మూలనకు బాటలు వేస్తోందని సామాజికవేత్తలు ప్రశంసిస్తుంటే చంద్రబాబుకు రుచించడం లేదు. 2014 ఎన్నికల్లో వందలకొద్దీ హామీలను గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీడీపీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోను మాయం చేశారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానంటూ నమ్మబలికారు. అసలు రూ.87 వేలు కోట్లు, వడ్డీ రూ.24 వేలు కోట్లు కలిపి మొత్తం రూ.1.11 లక్షల కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా రూ.15 వేల కోట్లు విదిల్చి (అది కూడా సున్నా వడ్డీని ఎగ్గొట్టి) నయ వంచన చేశారు. రూ.14 వేల కోట్ల రుణాలను మాఫీ చేయకుండా డ్వాక్రా మహిళలను దగా 2. ఓ గేటులో 1/4 బిగించి హంగామా చంద్రబాబు: పోలవరం ప్రాజెక్టుకు గేట్లు పెట్టి నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో సహా 72 శాతం పనులు నేనే పూర్తి చేశా... వాస్తవం: పోలవరం స్పిల్వేకు 25.72 మీటర్ల స్థాయిలో 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను అమర్చాలి. వరద నీటిని దిగువకు విడుదల చేయడానికి వీలుగా గేట్లను ఎత్తడానికి, దించడానికి హైడ్రాలిక్ సిలిండర్లు, హాయిస్ట్లను అమర్చాలి. చంద్రబాబు హయాంలో పోలవరం స్పిల్వే పునాది స్థాయిని కూడా దాటలేదు. స్పిల్వేలో 39, 40 పియర్స్ మాత్రమే 32 మీటర్ల స్థాయి వరకు చేశారు. ఆ స్థాయిలో గేట్లను అమర్చడానికి వీలుకాదు. 2018 డిసెంబర్ 24న రెండు పియర్స్ మధ్య నాలుగు స్కిన్ పేట్లను వెల్డింగ్ చేసి (ఇది ఒక గేటులో నాలుగో వంతు) అడ్డుగా నిలిపారు. దీంతో 48 గేట్లు అమర్చినట్లు, ప్రాజెక్టు పూరై్తనట్లు భ్రమ కల్పించారు. చంద్రబాబు అమర్చిన గేటు అనంతరం గాలి ఉద్ధృతికి రెండు పియర్స్ నుంచి కిందకు పడిపోయింది. ప్రాజెక్టు వద్దకు బస్సు యాత్రలతో భజన చేయించుకునేందుకు ఏకంగా రూ.వంద కోట్లు మంచినీళ్లలా ఖర్చు చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక కరోనా తీవ్రతలోనూ, గోదావరి వరద ఉద్ధృతిలోనూ స్పిల్వేను పూర్తి చేసి 48 గేట్లను బిగించారు. ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి వరదను అప్రోచ్ చానల్, స్పిల్వే, స్పిల్ ఛానల్ మీదుగా 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేశారు. దిగువ కాఫర్ డ్యామ్ పూర్తయ్యే దశకు చేరుకుంది. ఇప్పటివరకూ 12,060 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసంకల్పించారు. మొత్తమ్మీద ప్రాజెక్టు పనులు ఇప్పటిదాకా 47.94% పూర్తయ్యాయి. పరిహారం.. ఫలహారం చంద్రబాబు: న్యాయస్థానాల్లో దాఖలు కేసులను ఉపసంహరించుకునేలా రైతులతో చింతమనేని ప్రభాకర్ ద్వారా చర్చించి పోలవరం కుడి కాలువను పూర్తి చేశా.. వాస్తవం: దివంగత వైఎస్సార్ హయాంలోనే పోలవరం కుడి కాలువ 95% పూరై్తంది. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తన సామాజిక వర్గానికి చెందిన వారితో భూసేకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో కేసులు వేయించి కుడి కాలువ పనులను చంద్రబాబు అడ్డుకున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక తాను కేసులు వేయించిన రైతులతో చింతమనేని ద్వారా మంతనాలు జరిపి ఎకరానికి గరిష్టంగా రూ.69 లక్షల చొప్పున రూ.720 కోట్ల మేర పరిహారాన్ని అందించి చంద్రబాబు కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఆ తర్వాత మిగతా ఐదు శాతం పనులు చేశారు. 4. అవగాహనారాహిత్యంతో.. నాడు కమీషన్లు వచ్చే పనులకే చంద్రబాబు పచ్చజెండా ఊపారు. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయకుండానే నదీ గర్భంలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ను నిర్మించారు. ఎన్నికలకు ముందు హడావుడిగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టి నిర్వాసితులకు పునరావాసం కల్పించలేక మధ్యలోనే వదిలేశారు. 2019 మే 29 నాటికి పరిస్థితి ఇదీ! 2019 జూన్ రెండో వారంలోనే గోదావరికి వరదలు వచ్చాయి. నదీ గర్భంలో కాఫర్ డ్యామ్లు అడ్డంకిగా ఉండటం వల్ల వరద ఉద్ధృతి పెరిగి ఖాళీ ప్రదేశాల గుండా ప్రవహించడంతో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. గత సర్కారు అవగాహనా రాహిత్యం, కమీషన్ల దాహమే పోలవరం పనుల్లో జాప్యానికి మూలకారణం. 5. కళ్లాల వద్దే కొనుగోళ్లు కనపడవా? చంద్రబాబు: ధాన్యానికి మద్దతు ధర దక్కడం లేదు. దళారులతో కలిసి అధికారపార్టీ నేతలు రైతులను దోచుకుంటున్నారు. వాస్తవం: ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్దే రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. మూడున్నరేళ్లలో రూ.48,974 కోట్లతో రైతుల నుంచి 2.62 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం రైతులను దగా చేస్తుంటే చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. బీసీల వెన్నెముక విరిచింది మరిచావా బాబూ..? చంద్రబాబు: సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు అన్యాయం చేశారు. జనాభాలో 50% ఉన్న బీసీలకు పదవులివ్వకుండా సామాజిక అన్యాయం చేశారు. సంక్షేమ పథకాల ద్వారా బీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఈ పథకాలతో ఎంత ప్రయోజనం చేకూర్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. టీడీపీకీ బీసీలే వెన్నెముక. వాస్తవం: బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. సమాజానికి వెన్నెముకగా అభివృద్ధి చేస్తానని ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో ప్రతిపక్ష నేత హోదాలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా లేని రీతిలో 25 మందితో కూడిన మంత్రివర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన పది మందికి స్థానం కల్పించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్యం లాంటి అత్యంత కీలకమైన శాఖలు అప్పగించారు. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్కు అవకాశం కల్పించారు. అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీకి 8 రాజ్యసభ స్థానాలు దక్కితే అందులో 4 సీట్లు బీసీలకే ఇచ్చారు. స్థానిక సంస్థలలో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించడంపై చంద్రబాబు టీడీపీ నేతలతో హైకోర్టులో సవాల్ చేయడంతో 24 శాతానికి తగ్గిపోయాయి. చంద్రబాబు కుట్ర వల్ల బీసీలకు రిజర్వేషన్లు తగ్గడంతో, గతంలో ఉన్న 33% కంటే ఎక్కువగా అవకాశం ఇస్తానని మాటిచ్చిన సీఎం జగన్ ఆ మేరకు సర్పంచ్లు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ మేయర్లుగా సింహభాగం బీసీ వర్గాల వారినే నియమించారు. బీసీల కోసం శాశ్వత కమిషన్ను నియమించారు. బీసీ సామాజిక వర్గాల కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పదవుల్లో సింహభాగం ఆ వర్గాలకే ఇచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో ఇప్పటిదాకా రూ.1,77,585.51 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేయగా ఇందులో బీసీ వర్గాలకే రూ.85,915.06 కోట్లు దక్కాయి. పరిపాలన భాగస్వామ్యం కల్పించడం, ఆర్థికంగా చేయూత, ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా బీసీ వర్గాల సామాజిక సాధికారతకు సీఎం జగన్ బాటలు వేశారు. తోకలు కత్తిరిస్తా.. తాటతీస్తా! 2014లో బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తమ హక్కులను పరిరక్షించాలని కోరిన నాయీ బ్రాహ్మణులను తోక కత్తిరిస్తానంటూ బెదిరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని అభ్యర్థించిన మత్స్యకారులను తాట తీస్తానంటూ హెచ్చరించారు. నాడు చంద్రబాబు 25 మందితో కూడిన తన మంత్రివర్గంలో బీసీలకు ఆరు పదవులు మాత్రమే ఇచ్చారు. 2014–19 మధ్య చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపిన పాపాన పోలేదు. జీవనాడి జాప్యానికి బాబే కారణం చంద్రబాబు: ప్రతి సోమవారాన్ని పోలవారంగా పరిగణించి సమీక్ష చేశా. నెలకు ఒకసారి ప్రాజెక్టు వద్దకే వెళ్లి సమీక్షించా. కేంద్రమే నిధులు ఇస్తుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాశనం చేసింది. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి నేనే కారణమంటున్నారు.. వాస్తవం: విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల దాహం, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ నాడు చంద్రబాబు దక్కించుకున్నారు. 2013–14 ధరల ప్రకారం నిధులు ఇస్తే చాలని ఒప్పుకోవడంతో కేంద్రం రూ.20,398 కోట్లకే పరిమితం చేసింది. 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లు కాగా భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ.33,168 కోట్లు అవుతుంది. ఇదే అంశాన్ని సీఎం జగన్ పలు దఫాలు కేంద్రానికి వివరించి సవరించిన అంచనా వ్యయం ప్రకారం నిధులిచ్చి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహకరించాలని కోరుతూ వస్తున్నారు. అరకొరగా ఫీజులు.. ఆపై బడాయిలు చంద్రబాబు: నేను అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చా. సీఎం జగన్ కేవలం 11 లక్షల మందికే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. అదీ తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. విద్యార్థుల తండ్రులు ఆ డబ్బులు తీసుకుని మద్యం తాగుతున్నారు. వాస్తవం: ఇంజనీరింగ్ కళాశాలలో గరిష్టంగా ఫీజు రూ.1.10 లక్షలు ఉంటే చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.35 వేలు మాత్రమే ఇచ్చింది. ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారు. రూ.1,700 కోట్లకుపైగా ఫీజు రీయింబర్స్ డబ్బులను ఎగ్గొట్టడంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని చెల్లించి విద్యార్థులను ఆదుకుంది. సీఎం జగన్ అధికారంలో చేపట్టాక ఇంజనీరింగ్ సహా వివిధ కోర్సులకు ఎంత ఫీజు ఉంటే అంత ఫీజును ఏటా రెండు వాయిదాలలో రీయింబర్స్మెంట్ కింద తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. తల్లులు కాలేజీలకు వెళ్లి తమ పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకుని సదుపాయాలు, బోధనలో నాణ్యతను ఆరా తీయాలనే ఉద్దేశంతో వారి ఖాతాల్లో జమ చేస్తుంటే దారుణంగా అవమానించడం చంద్రబాబుకే చెల్లింది. చదవండి: చంద్రబాబు హైడ్రామా.. రెచ్చగొట్టే ప్రసంగాలతో.. విద్వేషాలు రగిల్చేలా.. -
ఒక్క ఇంటినీ కూల్చకున్నా.. ‘ఇప్పటం’ అబద్ధాలు ఇంకా..
సాక్షి, అమరావతి: తప్పుడు అఫిడవిట్లు సమర్పించి సానుకూల ఉత్తర్వులు పొందడంపై కన్నెర్ర చేస్తూ 14 మంది ఇళ్ల యజమానులు రూ.లక్ష చొప్పున ఖర్చుల కింద చెల్లించాలని సాక్షాత్తూ హైకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించిన తర్వాత కూడా జనసేన అధినేత పవన్కళ్యాణ్ ‘ఇప్పటం’ అబద్ధాలను ఇంకా కొనసాగించేందుకు సన్నద్ధం కావడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ నెల 27వతేదీన పవన్కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఇప్పటం ఇళ్ల యజమానులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేస్తారని ఆ పార్టీ పేర్కొంది. ఇప్పటంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని కట్టిన నిర్మాణాలను రూ.1.65 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నగర పాలక సంస్థ అధికారులు ఈ నెల 4వ తేదీన ఆక్రమణలు తొలగించిన విషయం తెలిసిందే. మానవతా దృక్పథంతో ఇళ్ల జోలికి వెళ్లకుండా ఆక్రమించి కట్టిన ప్రహారీ గోడలు, మెట్లు లాంటి వాటినే అధికారులు తొలగించగా ప్రభుత్వం ఇళ్లను కూల్చి వేసిందంటూ పవన్కళ్యాణ్ ఉద్రిక్తతలు రేకెత్తించేందుకు ప్రయత్నించారు. ఓ వర్గం మీడియా కూడా తప్పుడు కథనాలను ప్రచురించింది. అయితే జనసేన సభకు భూములిచ్చిన రైతులెవరు వారిలో లేరని సాక్ష్యాధారాలతో ఇప్పటికే రుజువైంది. చదవండి: హైకోర్టు జడ్జీల బదిలీపై టీడీపీ యాగీ -
ఎన్నికలే లక్ష్యంగా బాబు డేంజర్ గేమ్.. ఇంకెన్ని దారుణాలు చూడాలో..
ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు... నా చంద్రబాబు అధికారంలో ఉంటే చాలనుకుంటాడు రామోజీరావు. అందుకే... ‘బాబు మాట– బంగారం మూట’ అనే రీతిలో నారా వారు చెప్పే పచ్చి అబద్ధాలను కూడా పతాక శీర్షికల్లో అచ్చేస్తుంటాడు. కాస్తయినా ఇంగితజ్ఞానం, పత్రికగా కొంతైనా సామాజిక బాధ్యత ఉండాలి కదా? తన పాఠకులకే కాదు... ఈ రాష్ట్ర ప్రజలకు కూడా జవాబుదారీ అనే స్పృహ అక్కర్లేదా? ‘ఆక్వా జోన్– నాన్ ఆక్వా జోన్’ అనే పరిమితులు లేకుండా... ఆక్వా రైతులు అందరికీ యూనిట్ విద్యుత్తు రూ.1.50కే ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటం... అదో మహా ప్రసాదంలా ‘ఈనాడు’ భజంత్రీలు కొడుతూ అచ్చేయటం!!. అసలు ఆక్వా రైతుల పాలిట విలన్ ఎవరు రామోజీ? సీడ్ నుంచి ఫీడ్ వరకూ... చివరకు రొయ్యల ఎగుమతిదారుల వరకూ ఒకే వర్గానికి చెందిన వారు సిండికేట్గా ఏర్పడి... రైతుల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్న ముఠాగా మారటం అబద్ధమా? తన వర్గానికి చెందిన వ్యాపారుల దారుణాలకు వత్తాసు పలికింది చంద్రబాబు కాదా? ఫీడ్, సీడ్ ధరలు ఆకాశాన్నంటుతున్నా... రొయ్యల ధరలు పతనమవుతున్నా ఏనాడన్నా బాబు హయాంలో ప్రభుత్వం జోక్యం చేసుకుందా? ఇప్పటి మాదిరిగా కనీస మద్దతు ధరలు నిర్ణయించి వ్యాపారుల చేత కొనిపించే సాహసం చేసిందా? అప్పుడెందుకు పెన్నెత్తలేదు రామోజీ మీరు? బాబు అధికారంలో ఉంటే ఎన్ని దారుణాలు జరిగినా మీకు ‘సమ్మ’తమేనా? మరీ ఈ స్థాయి పాత్రికేయమా? అసలు ఆక్వా – నాన్ ఆక్వా జోన్లను తెచ్చిందే చంద్రబాబు నాయుడు కదా? ఆక్వా జోన్లలోని వారికే విద్యుత్తు, ఇతర సబ్సిడీలని నిబంధనలు పెట్టిందే చంద్రబాబు నాయుడు కదా? అప్పుడెందుకు ఈ నిబంధనలు పెట్టారు... ఇప్పుడెందుకు తొలగిస్తామంటున్నారని అడిగే బాధ్యత ‘ఈనాడు’కు లేదా? తాను అధికారంలో ఉంటూ ఏకంగా నాలుగున్నరేళ్ల పాటు యూనిట్ విద్యుత్తు ఆక్వా జోన్ల రైతులకు కూడా రూ.3.86 చొప్పున ఇచ్చింది చంద్రబాబు కాదా? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో మాయ చేయాలన్న ఉద్దేశంతో ఎలక్షన్ల్లకు 6 నెలల ముందు దాన్ని యూనిట్ రూ.2కు తగ్గించాడు. అది కూడా ఆక్వా జోన్లలోని రైతుల వరకే!!. ఆ నాలుగున్నరేళ్లూ యూనిట్కు రూ.3.86 చొప్పున చెల్లిస్తూ ఆక్వా రైతులు పడ్డ బాధలు ‘ఈనాడు’కు కనిపించలేదు... వినిపించలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది చంద్రబాబు మరి!!. కానీ అప్పట్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తూ ఆక్వా రైతుల వెతలు చూశారు. తాను అధికారంలోకి వస్తే ఆక్వా జోన్లలోని రైతులకు విద్యుత్తు చార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. దీంతో బాబుకు గుబులు పెరిగి... ఎన్నికల ముందు ధర తగ్గించి తన జబ్బలు తానే చరుచుకున్నారు. రామోజీ కూడా శక్తివంచన లేకుండా చంద్రబాబు నిర్ణయాన్ని శ్లాఘించారు. కానీ... ఈ ఎన్నికల గిమ్మిక్కును ఆక్వా రైతులు అర్థం చేసుకున్నారు. ‘ఇదేం ఖర్మరా బాబూ..’ అనుకునేట్టుగా బాబుకు బుద్ధి చెప్పారు. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా జోన్లలోని రైతులకు యూనిట్ రూ.1.50కే అందించటం మొదలుపెట్టారు వైఎస్ జగన్. జోనింగ్ నిబంధనలకు అర్థమేంటి? అసలు చంద్రబాబు ఆక్వా జోనింగ్ నిబంధనలు తెచ్చిందెందుకు? ఆక్వా సాగును కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయాలని కదా? అలా కాక ఎక్కడ పడితే అక్కడ కాలువ నీరు పారిన చోటల్లా చేపల చెరువులు వెలిస్తే మామూలు వ్యవసాయానికి భవిష్యత్తు ఉంటుందా? రాయలసీమలోని కడప జిల్లా మైదుకూరులో సైతం కాలువల వెంబడి చేపల చెరువులు తవ్వే ప్రయత్నాలు చేశారంటే ఏమనుకోవాలి? అలాంటి నాన్ –ఆక్వా ప్రాంతాల్లో కూడా రొయ్యల చెరువుల్ని విద్యుత్తు సబ్సిడీలిచ్చి ప్రోత్సహించాలన్న చంద్రబాబు ఆలోచన ఏ మేరకు సమంజసం? అలా రాయితీలిస్తే కాస్తో కూస్తో లాభసాటి కాబట్టి అంతా అటువైపే వెళతారు. అలా ఆక్వా సాగు చేసిన ప్రాంతాలన్నీ ఉప్పు నీటి కయ్యలుగా మారి మామూలు వ్యవసాయానికి పనికిరాకుండా పోతాయి. ఒకవేళ ఎప్పుడైనా... ప్రస్తుతం మాదిరిగా అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు తలెత్తి ఆక్వా సాగు దెబ్బతింటే... ఆ భూముల్ని మళ్లీ మామూలు సాగులోకి తీసుకురావటం అసాధ్యం. ఆ ఉద్దేశంతోనే జోనింగ్–నాన్ జోనింగ్ నిబంధనలొచ్చాయని ఎవరైనా చెబుతారు. మరిప్పుడు చంద్రబాబుకు ఏమైంది? రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు... నేను అధికారంలోకి వస్తే చాలన్న దుర్బుద్ధి స్పష్టంకావటం లేదూ? ఈయన్ని... ఈయన తానా అంటే... తందానా అంటూ తయారయ్యే రామోజీరావును ఏం చెయ్యాలి? అంతా బాబు మనుషులు కాదా? ఫీడ్ తయారు చేసే కంపెనీలూ వారివే. రొయ్యల్ని ఎగుమతి చేసే కంపెనీలూ వారివే. అంటే రైతుకు పెట్టుబడి వ్యయాన్ని నిర్ణయించేదీ వారే... ఉత్పత్తి ధరను నిర్ణయించేదీ వారే. వీళ్లు ఈ స్థాయిలో ముఠాలా మారి అన్నీ శాసించినపుడు గత ప్రభుత్వం ఏం చేసింది? ఆక్వా కార్య కలాపాల్లోని అవంతి ఫీడ్స్, దేవి సీఫుడ్స్, దేవి ఫిషరీస్, నెక్కంటి సీఫుడ్స్, సంధ్య ఆక్వా, గ్రోవెల్ ఫీడ్స్, వాటర్ బేస్ లిమిటెడ్... ఇవన్నీ ఎవరివి? చంద్రబాబు సన్నిహితులవి కావా? అసలు రాష్ట్రంలో వనామీ రొయ్యల పెంపకం 2009లో మొదలైనపుడు... 2014 వరకూ నాటి ప్రభుత్వాలు 2–3 సార్లు రేట్లు పెంచాయి. కిలో రేటు దాదాపుగా రూ.20 వరకూ పెరిగింది. మరి 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు కేవలం 70 పైసలు మాత్రమే ఎందుకు పెంచారు? ఎందుకు రైతులకు సరైన ధర రాకుండా వారి పొట్టగొట్టారు? 2019లో ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటిదాకా దాదాపు కిలోకు రూ.27 వరకూ పెరగటం అబద్ధమా? కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం అండగా నిలవటం అబద్ధమా? ఈ నిజాలు ఎన్నడూ ఎందుకు చెప్పరు రామోజీ? బాబు అబద్ధాలను మాత్రమే అచ్చేసే మీదీ ఒక పత్రికేనంటారా? ప్రతి ఏటా దోచుకోవటం... పచ్చి నిజం ఆక్వా ఎగుమతిదారుల మెడపై ప్రభుత్వం కత్తిపెట్టిందంటూ రకరకాల ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు... తన హయాంలో వారందరికీ ఇష్టారీతిన దోచుకోవటానికి లైసెన్స్ ఇచ్చారనే చెప్పాలి. ఏటా తొలిసారి రొయ్యల పంట చేతికొచ్చినపుడు ఏ రైతూ ఎక్కువ ధరను కళ్ల జూసేవాడు కాదు. 200 కౌంట్ ధర రూ.170–180 రూపాయలకు మించి పలికేది కాదు. ఎందుకంటే కంపెనీలన్నీ సిండికేట్గా ఏర్పడి ఈ మాయాజాలాన్ని కొనసాగించేవి. దానికి బాబు, రామోజీల అండ ఎటూ ఉంది. ‘ఈనాడు’ సైతం వీరి పక్షమే కనక... రైతుల వెతలను రాస్తే ఒట్టు!. అలా 170–180కి వీళ్లంతా రైతుల దగ్గర కొనుగోలు చేసిన తరవాత... అకస్మాత్తుగా ధర పెరిగిపోయేది. కానీ అలా పెరిగేటప్పటికి రైతుల చేతిలో రొయ్యలుండేవి కావు. ఇలాంటి పరిస్థితులుండకూడదనే చట్ట సవరణలు చేసి మరీ ఈ ప్రభుత్వం రైతుల్లో భరోసా కల్పించింది. అదే రామోజీరావు దృష్టిలో పెద్ద నేరమైపోయింది. ఆక్వా రైతుల గురించి ‘ఈనాడు’ రాసే ప్రతి రాతలో ప్రభుత్వంపై విషం చిమ్మటానికి... ఈ సిండికేట్లను బ్రేక్ చేయటమన్నదే ప్రధాన కారణమని వేరే చెప్పాల్సిన పని లేదు కూడా. అధికారంలో ఉన్నన్నాళ్లూ ఈ సిండికేట్లు దోచుకోవటానికి చంద్రబాబు సాయపడితే... ఎన్నికలు వచ్చినపుడు వీళ్లంతా కలిసి చంద్రబాబుకు ఆర్థికంగా సాయపడతారు. అదీ వీళ్ల లెక్క. అందుకే వీళ్లకు సాధారణ రైతులంటే లెక్క ఉండదు. ఇక్కడ గమనించాల్సిందొకటుంది. బాబు హయాంలో ముడిపదార్థాల ధరలు తగ్గినా.... ఫీడ్పై మాత్రం కిలోకు రూ.7 అధికంగా దోచుకున్నారు. కానీ బాబు పట్టించుకుంటే ఒట్టు!!. అదే ఈ ప్రభుత్వ హయాంలోకి వచ్చేసరికి ముడిపదార్థాల ధరలు భారీగా పెరిగాయి. ఇదే కారణంతో ఈ ఏడాది జూన్ నుంచి సెపె్టంబరు మధ్య 6 సార్లు కంపెనీలు ఫీడ్ ధరలు పెంచాయి. కానీ ప్రభుత్వం జోక్యం చేసుకుని 3 సార్లు తగ్గించింది. అంతేకాకుండా ముగ్గురు సీనియర్ మంత్రులు, సీనియర్ అధికారులతో ఆక్వా సాధికార కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ అందరితో చర్చించి... కిలోకు రూ.2.60 చొప్పున ఫీడ్ ధరలు తగ్గించింది. ఇలా ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచకుండా ఏకంగా చట్టాన్ని సైతం సవరించింది ప్రభుత్వం. అలా.. ఫీడ్ ధరలను నియంత్రించే వ్యవస్థను తేవటంతో పది ఎకరాల్లోపు ఉన్న రైతులకు దాదాపు రూ.10 లక్షల మేర ప్రయోజనం కలిగింది. కాకపోతే ఇలాంటి నిజాలను ‘ఈనాడు’ ఎప్పుడూ చెప్పదు. ఎందుకంటే ఇవి బాబు చేయలేని... కనీసం చేయాలనుకోని పనులు కాబట్టి!. జగన్ హామీ... బాబు జీవో.. బకాయిలు చెల్లించిన జగన్!! వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నపుడు... తాను అధికారంలోకి వస్తే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తు రూ.1.50కే ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో కలత చెందిన బాబు... అప్పటికప్పుడు ఆక్వా జోన్లలోని రైతులకు రూ.2కే యూనిట్ ఇస్తానని జీవో ఇచ్చారు. అది కూడా 2018 సెప్టెంబర్లో. అంటే 6 నెలల్లో ఎన్నికలున్నాయనగా!!. చిత్రమేంటంటే జీవో ఇచ్చినా ఆ మేరకు సబ్సిడీ నిధుల్ని విద్యుత్తు కంపెనీలకు మాత్రం ఇవ్వలేదు బాబు. అధికారంలోకి వచి్చన వెంటనే... 2019 జూలై 2 నుంచి వీరికి విద్యుత్తు యూనిట్ రూ.1.50కే ఇస్తున్నట్లు వైఎస్ జగన్ జీవో ఇచ్చారు. ఈ మూడున్నరేళ్లలో ఏకంగా రూ.2,687.47 కోట్ల రూపాయలు ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ రూపంలో ఖర్చు చేశారు. బాబు చెల్లించకుండా వదిలేసిన బకాయిలనూ చెల్లించారు. అదీ చిత్తశుద్ధి అంటే. ధరలెందుకు తగ్గాయి? అసలిప్పుడు రొయ్యల ధరలెందుకు పతనమయ్యాయి? ప్రధానంగా చైనా, అమెరికాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈక్వెడార్ లాంటి చిన్న దేశం నాణ్యమైన రొయ్యల్ని ఉత్పత్తి చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో సవాల్ విసిరింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్ లేక... ధరలు పతనమయ్యాయి. ఇక దేశీయంగా పరిస్థితులెలా ఉన్నా రాష్ట్రం మాత్రం నాణ్యమైన విద్యుత్తును సబ్సిడీ ధరకే అందించటంతో ఇక్కడ ఉత్పత్తి పెరిగింది. ఎగుమతిలో పోటీ పెరిగింది. కోవిడ్ లాక్డౌన్ సమయంలోనూ ఆక్వా పరిశ్రమ దెబ్బతినకుండా దానికి మినహాయింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సాహసమే చేసింది. మత్స్య రంగంలో ఏపీ ఉత్తమ రాష్ట్రం.. కేంద్రం కితాబు మత్స్య రంగానికి సంబంధించి అన్ని అంశాలలో ఆంధ్రప్రదేశ్ను భారత ప్రభుత్వం 2021లో ఉత్తమ రాష్ట్రంగా గుర్తించింది. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా అదే ఏడాది నవంబర్ 21న బహుమతి ప్రదానం చేసింది. మత్స్య ఉత్పత్తిలో రాష్ట్రం.. దేశంలోనే 30 శాతం వాటా కలిగి అగ్రగామిగా ఉంది. స్థూల విలువ జోడింపులో 2014–15లో 4.6 శాతంగా ఉన్న వాటా, 2020–21 నాటికి 9 శాతానికి అభివృద్ధి చెందింది. మొత్తం దేశ సముద్ర ఆహార ఎగుమతుల విలువలో రాష్ట్ర వాటా 2014–15 లో 28 శాతం ఉండగా, 2020–21 నాటికి అది 35 శాతానికి పెరిగింది. ఎగుమతుల విలువ 2014–15లో రూ.9,671 కోట్లు ఉండగా, 2020–21 నాటికి అది రూ. 20,019 కోట్లకు పెరిగింది. 2014–15లో 19.78 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న మత్స్య ఉత్పత్తి.. 2021–22లో ఏకంగా 48.13 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. ఈ వాస్తవాలు కళ్లెదుటే కనిపిస్తున్నా, మత్స్య రంగం వృద్ధి చెందలేదని చెప్పడం ఎవరి బాగు కోసం?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement