-
టీ20 ప్రపంచకప్ సెమీస్లో టీమిండియా.. కివీస్తో పోరుకు సై
ICC Under 19 Womens T20 World Cup 2023: అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీలో షఫాలీ వర్మ నాయకత్వంలోని భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాలో బుధవారం ‘సూపర్ సిక్స్’ దశ మ్యాచ్లు ముగిశాయి. గ్రూప్–1లో ఉన్న భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు 6 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. సెమీస్ చేరిన జట్లు ఇవే అయితే మెరుగైన రన్రేట్ కారణంగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన భారత్ (+2.844), ఆస్ట్రేలియా (+2.210) సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఇక గ్రూపు- 2లో ఉన్న ఇంగ్లండ్ వెస్టిండీస్పై బుధవారం ఘన విజయం సాధించింది. 95 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. ఇక ఇదే గ్రూపులో ఉన్న న్యూజిలాండ్ ఇప్పటికే పాకిస్తాన్పై 103 పరుగుల తేడాతో గెలుపొంది సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్ ఎప్పుడంటే ఈ నేపథ్యంలో శుక్రవారం(జనవరి 27) జరుగనున్న మొదటి సెమీస్ మ్యాచ్లో భారత్- న్యూజిలాండ్ తలపడనుండగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో సెమీస్ విజేతల మధ్య ఆదివారం ఫైనల్ జరుగనుంది. కాగా ఈ మెగా ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా సెమీస్ చేరుకోలేక ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. చదవండి: IPL: ఆల్టైం జట్టులో ఏబీడీకి చోటివ్వని టీమిండియా లెజెండ్! కానీ.. Kieron Pollard: విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్ప్రెషన్కు అర్థమేంటి! -
కీలకపోరులో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనున్న భారత్
మహిళల హాకీ ప్రపంచకప్లో భారత జట్టు నేడు పూల్ ‘బి’లో పటిష్టమైన న్యూజిలాండ్తో కీలక సమరానికి సిద్ధమైంది. నెదర్లాండ్స్ వేదికగా జరిగిన గత రెండు లీగ్ మ్యాచ్ల్లోనూ గోల్కీపర్ సవితా పూనియా కెప్టెన్సీలో భారత్.. ఇంగ్లండ్తో, చైనాతో మ్యాచ్లను 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత్ గెలిస్తే... లేదంటే కనీసం ‘డ్రా’ చేసుకుంటేనే క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు మిగిలి ఉంటాయి. -
World Cup 2022: ఎదురులేని ఆసీస్.. బంగ్లాను చిత్తు చేసి.. ఏడింటికి ఏడు గెలిచి
ఐసీసీ మహిళా వన్డే వరల్డ్కప్-2022 టోర్నీలో ఆస్ట్రేలియా దుమ్ములేపుతోంది. మెగా ఈవెంట్లో ఆడిన ఏడింటికి ఏడు మ్యాచ్లు గెలిచి తిరుగులేని జట్టుగా అవతరించింది. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్పై జయభేరి మోగించి అజేయ రికార్డును పదిలం చేసుకుంది. తద్వారా ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో మెగ్ లానింగ్ బృందం నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. వర్షం కారణంగా 43 ఓవర్లకు మ్యాచ్ కుదించిన నేపథ్యంలో 5 వికెట్ల తేడాతో గెలుపొంది బంగ్లాను చిత్తు చేసింది. టాస్ గెలిచి బంగ్లాదేశ్ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బంగ్లా మహిళా జట్టు నిర్ణీత 43 ఓవర్ల(వరణుడి ఆటంకం)లో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్ షర్మిన్ అక్తర్(24), లతా మొండల్(33) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఆదిలో తడబాటు.. అయితే.. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అలీసా హేలీ, రేచల్ హేన్స్ వరుసగా 15, 7 పరుగులకే నిష్క్రమించారు. ఇక వన్డౌన్లో వచ్చిన స్టార్ బ్యాటర్, కెప్టెన్ మెగ్ లానింగ్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరగడంతో గట్టి షాక్ తగిలింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బెత్ మూనీ అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకుంది. 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. మూనీ అజేయ అర్ధ శతకంతో ఆసీస్ 32.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు సాధించి జయకేతనం ఎగురవేసింది. బెత్ మూనీని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్కప్-2022 ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ స్కోర్లు: బంగ్లాదేశ్- 135/6 (43) ఆస్ట్రేలియా 136/5 (32.1) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: పాక్ను చిత్తు చేసి.. టాప్-4లోకి దూసుకెళ్లిన ఇంగ్లండ్
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్కప్-2022లో సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. క్రైస్ట్చర్చ్ వేదికగా గురువారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. పాక్ను చిత్తు చేసి టాప్-4లోకి చేరి సెమీస్ అవకాశాలు మరింత మెరుగుపరుచుకుంది. కాగా పాకిస్తాన్ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్కు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఆదిలోనే ఓపెనర్ నహీదా ఖాన్ అవుట్ కాగా.. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ మరూఫ్ 9 పరుగులకే పెవిలియన్ చేరింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ అమీన్ 32 టాప్ స్కోరర్గా నిలిచింది. మిగతా వాళ్లంతా ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 105 పరుగులకే పాక్ ఆలౌట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు స్టార్ ఓపెనర్ టామీ బీమౌంట్ 2 పరుగులకే నిష్క్రమించడం షాకిచ్చింది. అయితే మరో ఓపెనర్ డానియెల్ వ్యాట్ ఒంటి చేత్తో జట్టును విజయతీరాలకు చేర్చింది. మరో ఎండ్లో కెప్టెన్ హీథర్నైట్ సహకారం అందించడంతో 76 పరుగుల(68 బంతుల్లో- 11 ఫోర్ల సాయం)తో అజేయంగా నిలిచి ఇంగ్లండ్కు సునాయాస విజయం అందించింది. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్తో 19.2 ఓవర్లలో కేవలం ఒకే ఒక వికెట్ నష్టపోయి ఇంగ్లండ్ పాక్పై గెలుపొందింది. డానియెల్ వ్యాట్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్ మరో మ్యాచ్లో గెలిస్తే నేరుగా సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్కప్-2022 ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ స్కోర్లు: పాకిస్తాన్- 105 (41.3 ఓవర్లు) ఇంగ్లండ్- 107/1 (19.2 ఓవర్లు) View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: World Cup Super League: దక్షిణాఫ్రికాపై సంచలన విజయం.. వరల్డ్కప్ సూపర్ లీగ్ టాప్లో బంగ్లాదేశ్! టీమిండియా ఎక్కడ? View this post on Instagram A post shared by ICC (@icc) -
Women World Cup 2022: టీమిండియా రికార్డు బద్దలు కొట్టిన ఆసీస్ మహిళా జట్టు
Women World Cup 2022- వెల్లింగ్టన్: మహిళల వన్డే ప్రపంచకప్లో వరుసగా ఆరో విజయం నమోదు చేసిన ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ రికార్డు సాధించింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో నెగ్గిన మెగ్ లానింగ్ బృందం ఛేజింగ్లో భారత పురుషుల జట్టు పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. కాగా మంగళవారం జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 45.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (130 బంతుల్లో 135 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో 15 సెంచరీ సాధించి ఆసీస్ను విజయతీరానికి చేర్చింది. ఈ గెలుపుతో ఛేజింగ్లో 17 వరుస విజయాలతో టీమిండియా(భారత పురుషుల జట్టు) పేరిట ఉన్న రికార్డును ఆస్ట్రేలియా జట్టు తిరగరాసింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అంతకుముందు దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్లకు 271 పరుగులు చేసింది. లౌరా (90; 6 ఫోర్లు), సునె లుస్ (52; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. కాగా ప్రపంచకప్-2022 టోర్నీలో ఇప్పటికే సెమీస్ చేరిన ఆసీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement