-
Delhi: బోరు బావిలో చిన్నారి.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
దేశ రాజధాని ఢిల్లీలోని ఒక బోరుబావిలో చిన్నారి పడిపోయింది. ఈ ప్రమాదం ఢిల్లీ వాటర్ బోర్డు ప్లాంట్లో చోటుచేసుకుంది. కేశోపూర్ మండి సమీపంలోని ఢిల్లీ వాటర్ బోర్డు ప్లాంట్లోని 40 అడుగుల లోతైన బోరుబావిలో ప్రమాదవశాత్తూ ఓ చిన్నారి పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ, ఎన్డిఆర్ఎఫ్, ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారిని రక్షించేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీ అగ్నిమాపక శాఖ సిబ్బంది మాట్లాడుతూ బోరుబావిలో పడిన చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. ఎన్డిఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ వీర్ ప్రతాప్ సింగ్తో పాటు ఆ శాఖ బృందం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. బాధిత చిన్నారిని బయటకు తీసుకువచ్చేందుకు ఆ బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వి , చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు కృషి చేస్తున్నారు. #WATCH | Delhi: A child fell into a 40-foot-deep borewell inside the Delhi Jal Board plant near Keshopur Mandi. The NDRF team has reached the site along with Inspector-in-charge Veer Pratap Singh from NDRF. It will soon start rescue operations by digging a new borewell parallel… pic.twitter.com/CbD4GAKzR3 — ANI (@ANI) March 10, 2024 -
త్వరలో ఆర్టీసీ నీళ్లు
సాక్షి, హైదరాబాద్: త్వరలో టీఎస్ఆర్టీసీ మంచినీళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రత్యేకంగా ఆర్టీసీ బ్రాండ్తో ప్యాకేజ్డ్ తాగునీటిని ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని సంస్థ నిర్ణయించింది. రైల్ నీర్ పేరుతో రైల్వే సొంత బ్రాండ్తో నీటిని స్టేషన్లలో విక్రయిస్తున్న తరహాలోనే ఆర్టీసీ కూడా సొంత బ్రాండ్తో బస్సులు, బస్టాండ్లలో విక్రయించనుంది. ఈమేరకు నగర శివారులోని ఓ ప్యాకేజ్డ్ వాటర్ ప్లాంట్తో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ నీటి విక్రయం లాభసాటిగా ఉంటే, సొంత తయారీ యూనిట్ను ప్రారంభించాలని భావిస్తోంది. టికెట్ రూపంలో వచ్చే ఆదాయంతో ఆర్టీసీ మనుగడ దాదాపు ప్రశ్నార్థకం కావటంతో ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సొంత బ్రాండ్ ప్యాకేజ్డ్ నీటిని విక్రయించాలని నిర్ణయించింది. డివిజినల్ మేనేజర్ స్థాయి అధికారికి బాధ్యత ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో సగటున నిత్యం 33 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కోవిడ్కు ముందున్న స్థితికి చేరుకోవటంతో, ఇంత భారీ సంఖ్యలో ప్రయాణికుల ద్వారా కేవలం టికెట్ డబ్బులు మాత్రమే కాకుండా.. నీటిని అమ్మడం ద్వారా కూడా ఆదాయాన్ని పొందాలని భావిస్తోంది. ఇతర కంపెనీలతో పోలిస్తే కొంత తక్కువ ధరను విక్రయించడం ద్వారా డిమాండ్ను సృష్టించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం బస్టాండ్లలో పేరున్న బ్రాండ్లతోపాటు స్థానికంగా తయారయ్యే ఎన్నో రకాల మంచినీటి సీసాలు అందుబాటులో ఉంటున్నాయి. కానీ వీటిలో చాలావరకు నాణ్యత ఉండటం లేదన్న ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో, సొంత బ్రాండ్ పేరుతో నాణ్యమైన నీటిని అందుబాటులోకి తెస్తే బాగుంటుందని ఇటీవల ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. ఆమేరకు ఓ డివిజినల్ మేనేజర్ స్థాయి అధికారికి బాధ్యత అప్పగించారు. ఓ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం దాదాపు కొలిక్కి వచ్చిందని తెలిసింది. గతంలో బిస్లెరీతో ఒప్పందం గతంలో రమణారావు ఎండీగా ఉన్న సమయంలో బిస్లెరీ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. ఆర్టీసీ లోగోను కూడా ముద్రించిన సీసాలను బస్టాండ్లలో విక్రయించేలా ఏర్పాట్లు చేసింది. తొలుత కేవలం ఆ సీసాలను మాత్రమే అమ్మాలని నిబంధన విధించినా.. న్యాయపరమైన చిక్కులు రావటంతో వెనకడుగు వేసింది. ప్రస్తుతం ఆర్టీసీ లోగో చిన్నగా ఉన్న సీసా నీటిని బిస్లెరీ అమ్ముతోంది. కానీ దీనివల్ల ఆర్టీసీ బ్రాండ్కు గుర్తింపు రాలేదని ఆర్టీసీ తేల్చింది. దీంతో సొంతంగా కేవలం ఆర్టీసీ పేరుతోనే నీటి సీసాలను తేవాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు కాంప్లిమెంటరీగా 500 మి.లీ. బిస్లెరీ సీసాలను ఇస్తోంది. సొంత బ్రాండ్ అందుబాటులోకి వచ్చాక, ఆ కాంప్లిమెంటరీ సీసాలతోపాటు, అన్ని బస్సుల్లో సొంత నీటి సీసాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. డ్రైవర్/కండక్టర్ టికెట్లతోపాటు నీటి సీసాలనూ విక్రయించేలా ఏర్పాట్లు చేయనున్నారు. కుదిరితే, బస్టాండ్లలో కేవలం ఆర్టీసీ బ్రాండ్ సీసా నీళ్లు మాత్రమే విక్రయించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. పేరు, డిజైన్ చెప్పండి సొంతంగా ఆర్టీసీ బ్రాండ్తో తయారయ్యే నీటికి ఏ పేరు పెడితే బాగుంటుందో, సీసా ఆకృతి ఎలా ఉంటే బాగుంటుందో 9440970000 వాట్సాప్ నంబర్కు సూచనలను పంపాలని ఆర్టీసీ కోరింది. ఎంపిక చేసిన వాటికి రివార్డు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. -
అడివి శేష్ పెద్ద మనసు.. వారికోసం ఏకంగా వాటర్ ప్లాంట్..
కొందరు సెలబ్రిటీలు సామాజిక ధృక్పథాన్ని కలిగి ఉంటారు. సమాజంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు తమ వంతుగా ఏదైనా చేయాలనుకుంటారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలువురు తారలు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా అడివి శేష్ కూడా ప్రభుత్వాసుపత్రిలోని నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. హైదరాబాద్లోని కోఠి ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపు 300 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఆ ఆసుపత్రిలో సిబ్బందితో పాటు రోగులకు తాగునీటి సమస్య ఏర్పడిందనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న శేష్ తాత్కాలికంగా వాటర్ బాటిల్స్ను అందించారు. అంతేకాదు.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకుని హాస్పిటల్ అవసరాలకు సరిపడా తాగునీటిని సరఫరా చేసేందుకు సొంత ఖర్చుతో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేయించారు. ఇది గంటకు వెయ్యిలీటర్ల నీటిని శుద్ధి చేస్తుంది. తాగునీటి సమస్య తీర్చిన శేష్ని ఆస్పత్రిలోని కరోనా రోగులు, హాస్పిటల్ సిబ్బంది అభినందించారు. చదవండి: (గొప్ప మనసు చాటుకున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్) -
కొత్తూర్లో డా.వైఎస్సార్ ఫౌండేషన్ వాటర్ ప్లాంట్
లక్సెట్టిపేట్: దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్, ఎన్ఆర్ఐ గుండ అమర్నాథ్, 'నాటా' అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్సాగర్రెడ్డి దాతృత్వంతో కొత్తూర్ గ్రామంలో ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. ఈ ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి సహకారం అందించారు. ఆర్వో ప్లాంట్ను తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ప్రారంభించారు. డా.వైఎస్సార్ ఫౌండేషన్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో వందకు పైగా వాటర్ ప్లాంట్స్ నిర్మించి లక్షలాది మందికి ప్రతి రోజూ మంచి నీరు అందిస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో హెల్త్ క్యాంప్లు, బస్సు షెల్టర్లు, వీధి దీపాలు, అనాధాశ్రయాలకు, వృధాశ్రమాలకు సహాయం చేస్తూ గత పదేళ్లుగా ఎంతో మందికి చేయూత అందిస్తోంది. ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించిన డాక్టర్ గోసల రాఘవరెడ్డి, దాత గుండ అమర్నాథ్, డాక్టర్ ప్రేమ్ సాగర్రెడ్డికి ఆళ్ల రామిరెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. చదవండి: హైదరాబాద్ రేసర్.. రికార్డులు తిరగరాశాడు! చదవండి: ఉద్యోగ సామర్థ్యాలున్న పట్టణాల్లో హైదరాబాద్ టాప్ -
పార్క్ హయత్లో ఐవోటీ ఆధారిత వాటర్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ హాస్పిటాలిటీ కంపెనీ హయత్ హోటల్స్ కార్పొరేషన్ దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారిత వాటర్ ప్యూరిఫికేషన్, బాట్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ‘వాటర్హెల్త్ ఇండియా’తో ఒప్పందం చేసుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగించడం, నీటిని ఆదా చేయడం ఈ యూనిట్ ప్రత్యేకతని పార్క్ హయత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ థామస్ అబ్రహం మంగళవారమిక్కడ విలేకరులతో చెప్పారు. ప్రస్తుతం హయత్కు దేశంలో 30 హోటల్స్ ఉన్నాయి. వాటర్హెల్త్ సీఓఓ వికాస్ షా మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ఏటా 50 లక్షల టన్నుల ప్లాస్టిక్ విడుదలవుతోందని, ఇది భూమిలో లేదా సముద్రాల్లో కలిసిపోతోందని చెప్పారు. ‘‘2040 నాటికి దేశంలో నీటి సంక్షోభం ఏర్పడే అవకాశముంది. ఎందుకంటే ప్రపంచ జనాభాలో మన వాటా 17 శాతం. కానీ నీటి వనరుల్లో మన వాటా 4 శాతమే’’ అని వివరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement