-
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులతో సీపీ రంగనాథ్ సమావేశం
-
వరంగల్లో మెడికల్ కాలేజీని ప్రారంభించనున్న కేసీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11 గంటలకు హనుమకొండ జిల్లా దామెరకు చేరుకోనున్నారు. దామెర క్రాస్ వద్ద నిర్మించిన ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్, ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లను కేసీఆర్ ప్రారంభిస్తారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వరంగల్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్కు బయలుదేరుతారు. సీఎం పర్యటన ఏర్పాట్లను శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, గోపి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ తరుణ్జోషిలతో కలిసి పరిశీలించారు. -
కాబోయే సైనికుడు రాకేష్ అంతిమ యాత్ర
-
వరంగల్ ఓఆర్ఆర్ ల్యాండ్ పూలింగ్ రద్దు
సాక్షి, హైదరాబాద్ /వరంగల్ అర్బన్: వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణ ప్రక్రియలో భాగంగా రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ (భూసమీకరణ) పద్ధతిలో భూములను సేకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 41 కిలోమీటర్ల వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు కోసం వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 28 గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు సేకరించాలని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సర్వే పనులను ప్రారంభించింది. అయితే ల్యాండ్ పూలింగ్కు భూ యజమానుల సమ్మతి కోసం తెచ్చిన జీఓ 80ఏ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మూడు జిల్లాల పరిధిలో ఐదు నెలలుగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. దీంతో ఇటీవల ‘కుడా’ వైస్ చైర్మన్ పి.ప్రావీణ్య భూ సేకరణ నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిం చారు. అయినప్పటికీ రైతులు ఆందోళనలు కొనసాగించారు. రహదారుల దిగ్బంధనం చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హైదరాబాద్లో మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ల్యాండ్ పూలింగ్ విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ను ఆదేశించారు. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు అర్వింద్కుమార్ సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. -
33 అంతస్తులు, 2000 పడకలు.. త్వరలో వరంగల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
సాక్షి ప్రతినిధి, వరంగల్: వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా టి.హరీశ్రావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరంగల్ పెద్దాసుపత్రి నిర్మాణం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దేశంలోనే ఆదర్శంగా ఉండేలా, అత్యాధునికంగా రూపుదిద్దుకునేలా çసరికొత్త నమూనా, సీఎం కేసీఆర్ బొమ్మ ఉన్న ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. పేదలకు పెద్దరోగమొస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పట్నంబాట పట్టే వరంగల్ ప్రాంతవాసుల కష్టాలకు త్వరలో తెరపడనుంది. 59 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,180 కోట్ల వ్యయంతో 33 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏడాదిన్నరలో అందుబాటులోకి రానుంది. వరంగల్ను హెల్త్హబ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సీఎం భారీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి ఆవరణలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే విధంగాహెలీ అంబులెన్స్ సేవలు అందుబాటులోకిరానున్నాయి. ఈ ఆసుపత్రి నిర్మాణానికి వరంగల్ సెంట్రల్ జైలు ఆవరణలో జూన్ 21న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. రెండు వేల పడకలు.. 36 విభాగాలు... రెండువేల పడకల సామర్థ్యంతో తీర్చిదిద్దనున్న ఈ ఆ స్పత్రిలో 36 విభాగాలు పనిచేయనున్నట్లు వైద్య, ఆరో గ్య శాఖ ఉన్నతాధికారులు గతంలోనే వెల్లడించారు. సుమారు 500 మంది వైద్యులు, వెయ్యి మందికిపైగా నర్సులు, పారామెడికల్ సిబ్బందితోపాటు ఇతర సిబ్బంది ఇక్కడ పనిచేస్తారు. పది సూపర్ స్పెషాలిటీ విభాగాలతో రోగులకు సేవలందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఎండోక్రైనాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, న్యూరో సర్జరీతోపాటు, పిడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర సూపర్ స్పెషాలిటీ విభా గాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. కొత్తది అందుబాటులోకి వస్తే అన్నిరకాల వైద్య సేవలు, శస్త్రచికిత్సలు ఇక్కడే అందుతాయి. పర్యావరణహితంగా నిర్మాణం భారీ నిర్మాణం పూర్తిగా పర్యావరణహితంగా సాగనుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే జీవ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తారు. పచ్చదనం వెల్లివిరిసేలా భవన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. కెనడా తరహా వైద్య విధానాలు, సౌకర్యాలతో ఆస్పత్రి నిర్మించాలని ఆయన అధికారులకు సూచించగా ఈ మేరకు భవనం మ్యాప్, ప్లాన్ను సీఎం దృష్టికి తెచ్చారు. కేసీఆర్ ఆదేశాలతో కెనడా వైద్య విధానాలపై అధ్యయనానికి తెలంగాణ వైద్య నిపుణులు బృందం త్వరలో ఆ దేశానికి వెళ్లనుంది.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement