-
విశాఖ కలెక్టర్ వ్యక్తిగత హాజరుకు హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా సబ్బవరం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలన్న తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు విశాఖ జిల్లా కలెక్టర్ జనవరి 3వ తేదీన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సబ్బవరంలోని 255, 272, 277 సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిలో కె.దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అధికారులతో కుమ్మక్కై నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఎస్.చినవెంకటేశ్వర్లు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. విచారణ జరిపిన సీజే ధర్మాసనం ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని కలెక్టర్ను ఆదేశిస్తూ గత ఏడాది ఉత్తర్వులిచ్చింది. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. కోర్టు ఆదేశాలున్నా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయని పిటిషనర్ న్యాయవాది ఎన్.హెచ్.అక్బర్ తెలిపారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారంటూ, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం కలెక్టర్పై మండిపడింది. -
‘కరోనాపై మూడంచెల వ్యవస్థతో జాగ్రత్తలు’
సాక్షి, విశాఖపట్నం: కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా విషమ పరిస్థితుల్లో ఉన్న రోగుల కోసం జిల్లాలో 7 వేలకు పైగా అత్యవసర బెడ్స్ను సిద్దం చేస్తున్నామని విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. మెడికల్ అసోషియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ శనివారం సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజురోజుకి కరోనా తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో రెండు, మూడు నెలల కార్యచరణను మరో 2,3 రోజుల్లో సిద్దం చేస్తున్నామని చెప్పారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో మూడంచెల వ్యవస్ధ ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకొనున్నామన్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న పేషేంట్ల కోసం ప్రత్యేకంగా వైద్య నిపుణులతో కూడిన టెలీ మెడిసిన్ సెంటర్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ప్రత్యేక వైద్య చికిత్స అందించాల్సి ఉన్న కరోనా పేషేంట్లను మాత్రమే కోవిడ్ ఆసుపత్రులకి తరలిస్తామని తెలిపారు. అత్యవసర పరిస్ధితుల కోసం సుమారు 15 లక్షల వ్యయంతో పది డిజిటల్ ఎక్స్రే మిషన్లు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే కోవిడ్ ఆసుపత్రులు, సెంటర్లలో నాణ్యమైన భోజన సదుపాయాలు అందించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. కొత్త మార్గదర్శకాల ఆధారంగా భోజనం మరింత నాణ్యత ఉండేలా ఒక్కొక్క కాంట్రాక్టర్కి ఒక సెంటర్ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉన్నామన్నారు. విశాఖలో డి టైప్ ఆక్సిజన్ సిలిండర్లకు కొరత లేదని ఈ సందర్భంగా కలెక్టర్ స్ఫష్టం చేశారు. -
కరోనా: ‘ఆ కమిటీ మంచి ఫలితాలను ఇస్తుంది’
సాక్షి, విశాఖపట్నం: కరోనా మహమ్మారి కట్టడిలో అధికారుల పనితీరు ప్రశంసనీయమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా కట్టడి కోసం కలెక్టర్ వినయ్ చంద్ ఏర్పాటు చేసిన 21 కమిటీలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. విశాఖ జిల్లాలో రెడ్జోన్లపకై మరింత దృష్టి సారించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావోద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు చెప్పారు. పేదల కోసం ప్రభుత్వం నుంచి మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టామన్నారు. పేదలను అన్ని విధాలా ఆదుకోవాలిని సీఎం జగన్ సూచించారని మంత్రి పేర్కొన్నారు. -
పారదర్శకంగా భూ సమీకరణ..
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో భూ సమీకరణ పారదర్శకంగా జరుగుతోందని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. అర్హులైన అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు జిల్లాలో ఆరు వేల ఎకరాల భూ సమీకరణ చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో సెంట్ల భూమిని ఇళ్లు నిర్మాణం కోసం అర్హులైన పేదలకు కేటాయిస్తున్నట్లు వివరించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం భూ సేకరణ చేస్తున్నామని అదంతా పూర్తిగా ప్రభుత్వ భూమిలో మాత్రమే జరుగుతోందన్నారు. దీనికోసం నిర్దిష్టమైన లే అవుట్లు కూడా రూపొందించడమే కాకుండా మార్చి 10 నాటికి పూర్తిస్థాయిలో ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రైతులకు నష్టం కలిగించం.. ప్రభుత్వ భూములను సాగుచేస్తున్న వ్యక్తులు కూడా నిర్దిష్టమైన ఆధారాలను బట్టి అభివృద్ధి చేసిన లే అవుట్లలో 900, 450 గజాల చొప్పున కేటాయించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ సిటీ లో ఇళ్ల కోసం రూ. 25 వేలు చొప్పున నగదు డిపాజిట్ చేసిన లబ్ధిదారులకు కేటాయింపు జరుగుతుందని వివరించారు. ఎక్కడ ప్రైవేట్ భూములు తీసుకోవడం కానీ, రైతులకు నష్టం కలిగించే రీతిలో భూ సేకరణ గాని సమీకరణ గాని ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. భూ సమీకరణ కోసం రూ.1300 కోట్లు.. గిరిజన ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు వచ్చాయని ఆయా ప్రాంతాల్లో వారికి భూములు కేటాయింపు జరుగుతుందని చెప్పారు. ప్రధానంగా ఏజెన్సీలో పాడేరు ప్రాంతంలో ఎక్కువగా ప్రభుత్వ భూమి ఉండడంతో ఆ ప్రాంతంలో ఎక్కువ మందికి ఇళ్ల స్థలాలు కేటాయింపు జరుగుతుందన్నారు. పినగాడి లో పేదల కోసం రూపొందిస్తున్న లే అవుట్ లో మా భూమి పూర్తిగా ప్రభుత్వ ఖాళీ స్థలం గా చెప్పారు. రైతులకు ఇబ్బంది కలిగించే రీతిలో ఎక్కడ భూమి తీసుకోవడం లేదన్నారు. రైతులకు భూ సమీకరణ కింద ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా వారి ఖాతాలోనే వేస్తున్నామ ని చెప్పారు.. భూసమీకరణ కోసం రూ. 1300 కోట్లు ప్రభుత్వం నిర్దేశించిందని కలెక్టర్ వెల్లడించారు. -
విశాఖ అభివృద్ధిపై కలెక్టర్ నివేదిక
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరం అభివృద్ధి పనులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ సోమవారం నివేదిక సమర్పించారు. నగర శివారు ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం రూ.240 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఇంటింటికి కుళాయి పథకం, ఏలూరు నీరు నిల్వ చేసేందుకు రూ.500 కోట్లతో రిజర్వాయర్ల మార్పునకు ప్రతిపాదనలు చేశారు. విశాఖలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే కలెక్టర్ను వివరాలు కోరారు. కాగా, విశాఖలో సీ హారియర్ మ్యూజియం నిర్మాణానికి త్వరలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement