-
లేని సిబ్బందికి లక్షల్లో జీతాలు!
సాక్షి, హైదరాబాద్ : అసలే నష్టాలతో ఆర్టీసీ కుదేలైంది. ఇటు ఆదాయం పెరగకపోగా దివాలా దిశగా సాగుతోంది. దాన్ని మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. కానీ ఆ సంస్థలో తిష్ట వేసిన కొందరు అవినీతి అధికారులు ఇప్పుడు కూడా తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వచ్చే ఆదాయానికీ తెలివిగా గండి కొడుతున్నారు. వీరితో ఉండే సంబంధాలతో ఉన్నత అధికారులు దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ అధికారి బాగోతం విజిలెన్స్ విచారణలో బట్టబయలైంది. అయినా ఆ అధికారిని కాపాడేందుకు తెరవెనక యత్నాలు జరుగుతున్నాయి. జీతాల పేరుతో స్వాహా.. ఆర్టీసీలో కొన్ని విభాగాల్లో సొంత సిబ్బంది సరిపోక ఔట్సోర్సింగ్ ద్వారా నియమించుకోవటం పరిపాటి.. అలా ఓ డిపోలో మెకానిక్లను నియమించుకున్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించి, వారికి జీతాలు చెల్లించినట్టు చూపి ఆ నిధులు స్వాహా చేసినట్టు ఫిర్యాదులందాయి. దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు కొన్ని రోజులుగా విచారణ జరుపుతున్నారు. గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఓ హాజరుపట్టికను నిర్వహిస్తారు. లోనికి Ððవెళ్లేప్పుడు, వచ్చేప్పుడు అక్కడ సిబ్బంది సంతకం చేస్తారు. వీరు తప్ప సెక్యూరిటీ అనుమతి లేకుండా లోనికి వేరెవరూ వెళ్లటానికి ఉండదు. కానీ, గేటు వద్ద ఉండే హాజరు రిజిస్టర్తో పోలిస్తే లోపల ఉండే ప్రధాన హాజరుపట్టికలో మాత్రం అదనంగా కొందరు సిబ్బంది సంతకాలు చేసినట్టు ఉంది. అంటే లోనికి ఎవరూ అదనంగా వెళ్లకుండానే సంతకాలు ప్రత్యక్షమయ్యాయి. అవన్నీ బోగస్ సిబ్బంది పేర అధికారులే పెట్టిన సంతకాలన్న విషయం బయటకొచ్చింది. దీనిపైనే విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి డిపోలోని ఓ ఉన్నతాధికారిని విచారిస్తున్నారు. ఇప్పుడు కరీంనగర్లో ఉండే స్థానిక విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి ఆ అధికారిని పిలిపించి ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఇక ఇదే అధికారి గతంలో రోడ్డు ప్రమాదానికి గురై దెబ్బతిన్న బస్సు డ్రైవర్ నుంచి నష్టపరిహారంగా వసూలు చేసిన రికవరీ మొత్తం నుంచి కొంత స్వాహా చేసినట్లు ఫిర్యాదులొచ్చాయి. అప్పట్లో విజిలెన్స్ విచారణలో ఆ బాగోతం వెలుగుచూసింది. కానీ ఓ ఉన్నతాధికారి దగ్గరుండి మరీ వేటు పడకుండా బదిలీతో సరిపుచ్చారు. ఆ ఉన్నతాధికారి అండదండలతోనే మళ్లీ ఆ అవినీతి అధికారి తిరిగి పాత డిపోకు వచ్చి నిధుల స్వాహా పర్వానికి తెరతీశారు. ఇప్పుడు కూడా మళ్లీ వేటు పడకుండా అంతర్గత విచారణ పేరుతో కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్టు సిబ్బంది ఆరోపిస్తున్నారు. వేసవిలో కూజాల కొనుగోలు పేరుతో.. ఇక మరో అధికారి గతంలో వేసవిలో సిబ్బందికి చల్లటి నీళ్లందించేందుకు కూజాలు కొన్నట్టు బిల్లులు పెట్టి నిధులు స్వాహా చేశారు. దానికి సూత్రధారి అయిన అధికారిని నాడు వరంగల్లో పనిచేసి ప్రస్తుత హెడ్ఆఫీసులో ఉన్న అధికారి కాపాడారని సిబ్బంది చెప్పుకొంటారు. ఆ ఉన్నతాధికారి ఇప్పటికీ ఆ అవినీతి అధికారికి అండదండలు అందిస్తున్నారు. ప్రభుత్వ పరంగా పైస్థాయిలో పర్యవేక్షణ అంతంత మాత్రమే కావటం, గతంలో బస్భవన్ నుంచి నేరుగా ఉండే పర్యవేక్షణ లోపించటంతో ఉన్నతాధికారులు తమ బలహీనతలతో అవినీతి సిబ్బందిని పెంచి పోషిస్తున్నారు. దొంగ బిల్లులతో ఆర్టీసీ ఖజానాకు గండికొడుతున్నారు. కొందరు ఉన్నతాధికారులు కార్యాలయాల్లో అందుబాటులో లేకుండా, తాము కాపాడుతున్న సిబ్బందితో అంటకాగుతున్నారు. బస్భవన్పై దృష్టి సారిస్తే అలాంటి వారు దొరుకుతారని, వారే ఆర్టీసీ ఆదాయం పెరగకుండా గండి కొడుతున్నారని ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. పదవీ విరమణ చేసి ఆర్టీసీ విజిలెన్స్లో ఉన్నత స్థానంలో ఉన్న కొందరు అధికారుల అండదండలు ఉండటంతోనే అవినీతికి పాల్పడుతున్న సిబ్బందికి ఏ భయం లేకుండా పోయిందని తెలుస్తోంది. -
రేషన్ బియ్యం స్వాధీనం
గౌరవరం(జగ్గయ్యపేట) : రేషన్ బియ్యాన్ని రెండు లారీల్లో తరలిస్తుండగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్న సంఘటన ర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. వత్సవాయి మండలం లింగాల గ్రామం వైపు నుంచి రెండు లారీల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకు సమాచారం వచ్చింది. దీంతో ఆయన విజిలెన్స్ సీఐ అబ్దుల్ నబి సిబ్బందితో కలిసి గ్రామంలోని జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించారు. తనిఖీలో రెండు లారీల్లో బియ్యం వస్తున్నట్లు గుర్తించి రెండు లారీలను అదుపులోకి తీసుకున్నారు. రెండు లారీల్లో 700 బస్తాల్లో 35 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అనంతరం వాటిని చిల్లకల్లు పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం విజిలెన్స్ సీఐ మాట్లాడుతూ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ డీటీకు అప్పగించినట్లు తెలిపారు. డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement