-
ఈసీని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పించడంలో సిద్ధహస్తులు. ప్రజలను ఏ విధంగా మోసం చేయాలనేది టీడీపీ ఆలోచన’’ అంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది. టీడీపీ నేతలు అక్రమ మార్గంలో గెలిచేందుకే ప్రయత్నిస్తున్నారు. చాలమందికి రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయి. వాటిని తొలగించాలని ఈసీని కోరాం. ఎవరికైనా సరే ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి’’ అని వైఎస్సార్సీ నేతలు పేర్కొన్నారు. హైదరాబాద్, ఏపీలో 4 లక్షల 30 వేల 264 ఓట్లు ఉన్నాయి. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్కు అందించాం. డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవోను కోరాం. దేశంలో ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ విధానం. ఇలాంటి ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని కోరాం. -మంత్రి జోగి రమేష్ ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం జగన్ ఆకాంక్ష. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. మోసాలు చేయడమే చంద్రబాబు ప్రధాన అజెండా. ఒక సామాజికవర్గం ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నాయి. టీడీపీ ప్రలోభాలతో ప్రజలను లోబరుచుకుంటుంది. డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు తాను చేసిన తప్పులు ఇతరులపైకి నెడతారు. ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాలో అబద్ధాలు చెప్పాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. -మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇదీ చదవండి: బాబు కోసం ఇంత బరితెగింపా!? -
9 నుంచి కులగణన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చరిత్రాత్మకమైన కులగణన ప్రక్రియను డిసెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మంత్రి వేణు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనగణన తప్ప కులగణన జరగలేదని చెప్పారు. సామాజిక సాధికారితకు చిరునామాగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గొప్ప సంకల్పంతో కులగణన చేపట్టాలని నిర్ణయించారని తెలిపారు. కులాలతోపాటు అన్ని వర్గాల పేదల తలరాతలు మార్చడానికే సమగ్ర కులగణనను తమ ప్రభుత్వం చేపట్టిందని పునరుద్ఘాటించారు. ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు కులగణన చాలా అవసరమని చెప్పారు. సమగ్ర కులగణనతో రాష్ట్రంలో పేదవాడి జీవితానికి భద్రత లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో నిర్వహించనున్న కులగణన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని మంత్రి ధీమా వ్యక్తంచేశారు. బీసీలను అణగదొక్కిన చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపడుతున్నట్లు ప్రకటించడంతో చంద్రబాబు సహా ప్రతిపక్షనేతలకు వెన్నులో వణుకుపుడుతోందని మంత్రి వేణు అన్నారు. చంద్రబాబు హయాంలో బీసీలను కేవలం ఓట్లు వేసేందుకు పనికివచ్చే యంత్రాలుగా చూశారని మండిపడ్డారు. విద్య అవకాశాలను అందుకోలేని, ఆర్థికంగా బలహీనంగా ఉన్న బీసీలతోపాటు అనేక వర్గాలను చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అణగదొక్కారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నాననే అహంకారంతో ‘మత్స్యకారులను తోలుతీస్తా. నాయీబ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తా...’ అని అన్న మాటలు తనను ఎంతో బాధించాయని మంత్రి వేణు చెప్పారు. చంద్రబాబు వివక్షతో చూసిన కులాలను సీఎం వైఎస్ జగన్ అక్కున చేర్చుకున్నారని తెలిపారు. అట్టడుగు వర్గాల్లో ఆత్మన్యూనతాభావాన్ని తొలగించి వారు సగర్వంగా తలెత్తుకుని జీవించేలా సీఎం జగన్ అండగా నిలిచారని ప్రశంసించారు. కులగణనలో ఎవరి సూచనలు, సలహాలు తీసుకోలేదని టీడీపీ చేస్తున్న విమర్శల్లో నిజం లేదని మంత్రి కొట్టిపారేశారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా, ప్రాంతీయ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించి అన్ని కులాల నాయకుల అభిప్రాయాలు సేకరిస్తున్నామని, వాటిని క్రోడీకరించి కులగణను సమర్థవంతంగా నిర్వహిస్తామని వివరించారు. అవసరమైతే మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటే స్వాగతించాల్సిందిపోయి విమర్శించడం సరికాదని ఆయన హితవుపలికారు. -
కులగణనతో భావితరాలకు మరింత మేలు
సాక్షి, అమరావతి/బీచ్రోడ్డు(విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న సమగ్ర కుల గణన చరిత్రాత్మకమని, గొప్ప మనస్సుతో ఈ నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్.. దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కొనియాడారు. ఏపీలో కుల గణన–2023పై ఆయా వర్గాల అభిప్రాయాల సేకరణకు ప్రభుత్వం రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలులో ప్రాంతీయ సమావేశాలు జరిగాయి. సోమవారం విశాఖ, విజయవాడలో నిర్వహించారు. ఈ నెల 24న తిరుపతిలో నిర్వహిస్తారు. విజయవాడ సమావేశంలో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ఏడాది కిందట సీఎం జగన్ నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసి చూపిస్తున్నారని, ప్రతిపక్షాలు దీనిని రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు. ఇది సామాజిక కోణంలో తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 723 కులాల సమగ్ర లెక్కలు తేల్చేందుకు కుల గణన ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. కుల గణనతో అందరి తలరాతలు మారతాయని, భావితరాలకు మరింత మేలు జరుగుతుందని మంత్రి వేణు వివరించారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బడుగుల కోసం పుట్టిన కారణ జన్ముడు సీఎం జగన్ కర్నూలు ఎంపీ సంజీవ్కుమార్ మాట్లాడుతూ కుల గణన ప్రక్రియ పూర్తయితే జనాభా శాతం ప్రకారం అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఏపీ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ అంబేడ్కర్, పూలే ఆలోచనా విధానంతో సీఎం జగన్ అట్టడుగు వర్గాలకు మేలు చేస్తున్నారని, రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా నామినేటెడ్ నుంచి కేబినేట్ పదవుల వరకు అట్టడుగు వర్గాలకు అగ్రపీఠం వేస్తున్నారని కొనియాడారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ కుల గణన పూర్తయితే అనేక సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతుందని చెప్పారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ 92 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ కుల గణన సామాజిక మార్పులకు నాంది పలుకుతూ అరుదైన రికార్డు సృష్టిస్తుందన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి మాట్లాడుతూ కుల గణన ప్రక్రియలో కుల సంçఘాల పెద్దలను, ప్రతినిధులను భాగస్వామ్యం చేసి నూరు శాతం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు మాట్లాడుతూ ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు ఆయా కుల నాయకులను కూడా అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర యాదవ మహాసభ అధ్యక్షుడు లాకా వెంగళరావు మాట్లాడుతూ కుల గణన జాబితాలను స్థానిక సచివాలయాల వద్ద ప్రదర్శనకు పెట్టి అభ్యంతరాలను కూడా స్వీకరించాలని చెప్పారు. సమాచార గోప్యతకు అధిక ప్రాధాన్యం విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర కుల గణన ప్రాంతీయ సదస్సులో జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ మాట్లాడుతూ కులగణన సర్వే కారణంగా పాత కుల ధ్రువీకరణ పత్రాల నిలుపుదల గానీ, సంక్షేమ పథకాల నిలుపుదలగానీ జరగదన్నారు. యాప్ ద్వారా నిర్వహించే ఈ సర్వేలో సమాచార గోప్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. ఈబీసీ కార్పొరేషన్ అదనపు ఎండీ మల్లికార్జునరావు మాట్లాడుతూ సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేయడం కోసం ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 1931 తర్వాత కుల గణన చేపట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని పలు కార్పొరేషన్ల చైర్పర్సన్లు కొనియాడారు. ఉప కులాలకు కూడా వేర్వేరుగా గణన చేపట్టాలని పలు కుల సంఘాల ప్రతినిధులు సూచించారు. కుల గణన సమయంలో ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలని, అలాగే స్కూల్స్ నుంచి పొందిన పత్రాలను సమర్పించాలని.. లేకుంటే కొంత మంది స్వార్థంతో తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఎస్టీ కులంలో చాలా మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలను పొందుతున్నారని.. ముఖ్యంగా ఒడిశా నుంచి వచ్చిన వారు ఎస్టీలుగా చెలామణి అవుతున్నారని పలువురు ఎస్టీ కులాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు జాన్ వెస్లీ, సూరిబాబు, పిల్లా సుజాత, సుజాత, రమాదేవి, అమ్మాజీ, మధుసూదనరావు, అనూష, అప్పలకొండ పాల్గొన్నారు. -
బిహార్లో కులగణనకు రాజకీయ కోణం ఉంది: మంత్రి వేణు గోపాలకృష్ణ
-
నైతికత వదిలేసిన చంద్రబాబు
కాకినాడసిటీ: రాష్ట్రంలో తమకు ప్రజాదరణ తగ్గిపోయిందని గ్రహించిన చంద్రబాబు తన కేడర్ను, నాయకులను నమ్మలేక జనసేనను పక్కన పెట్టుకొని రాజకీయ నైతికతను మొత్తం వదిలేశారని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కాకినాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2014లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్ తనను నమ్ముకున్న అనేక వర్గాలను హింసించడానికి తోడ్పడ్డాడని విమర్శించారు. పవన్ కల్యాణ్ ప్రతిసారీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ది అరాచక పాలన అంటున్నారని, పేదలు ఎక్కడున్నా వెతికి పట్టుకొని మరీ వారి సంక్షేమం కోసం పాటు పడటమే అరాచకమా? వెనుకబడిన వర్గాల జీవితాలను మార్చడం కోసం పని చేయడం అరాచకమా? చెప్పాలని మంత్రి వేణు నిలదీశారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
విద్యార్థుల్లారా.. రండి మాతృ దేశానికి సేవ చేయండి.. ఫిజిక్స్ వాలా పిలుపు
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
Advertisement