-
నాగార్జున సాగర్ డ్యామ్ కట్టిందే కాంగ్రెస్ పార్టీ
-
హేతుబద్ధీకరణ సరికాదు
మహబూబ్నగర్ విద్యావిభాగం: ఆగస్టు నెలలో రేషనలైజేషన్ చేయాలనే విద్యాశాఖ నిర్ణయం సరికాదని ఏఐటీఓ సెక్రటరీ జనరల్ పి.వెంకట్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 10మంది విద్యార్థులున్న పాఠశాలలను విద్యాసంవత్సరం ప్రారంభమైన రెండు నెలల తర్వాత ఇతర పాఠశాలల్లో విలీనం చేయాలని, కొన్ని పాఠశాలలను మూసి వేయాలని నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు విద్యకు దూరమై డ్రాపౌట్స్ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం రేషనలైజేషన్ చేస్తూపోతే ప్రభుత్వ పాఠశాలలు మూతపడతాయని, ప్రైవేటు పాఠశాలలు బలోపేతమవుతాయని తెలిపారు. ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరే విధంగా ప్రోత్సహించాలని కోరారు. -
ఫ్యాన్సీ నంబర్ రూ. 4.8 లక్షలు
హైదరాబాద్: వాహనాల ఫ్యాన్సీ నంబర్ల కోసం వినియోగదారులు పోటీపడి మరి భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంటున్నారు. తమకు నచ్చిన నంబరు కావాలనుకున్న వారు.. ఎంత రేటు పెట్టడానికైనా వెనుకాడడం లేదు. తాజాగా గురువారం టీఎస్ 11 ఈఎఫ్ 9999 నంబర్ రూ. 4.8 లక్షల ధర పలికింది. మలక్పేట్ ఆర్టీవో పరిధిలో వెంకట్రెడ్డి అనే వ్యాపారి ఈ నంబర్ను దక్కించుకున్నాడు. మలక్పేట్ పరిధిలో ఇంత మొత్తానికి నంబర్ అమ్ముడు పోవడం ఇదే మొదటి సారి అని ఆర్టీవో అధికారులు తెలిపారు. గత వారంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో టీఎస్ 09 ఈఎల్ 9999 ఫ్యాన్సీ నంబర్కు రూ.10 లక్షలు వెచ్చించిన విషయం తెలిసిందే. -
అయ్యో..పాపం!
రోడ్డు ప్రమాదంలో తెగిపడ్డకాలు కోరుట్ల : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మోకాలు వరకు తెగిపోయిన హృదయవిదారక ఘటన కోరుట్ల మండలం మోహన్రావు పేట గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు చెందిన వెంకట్రెడ్డి(35) జగిత్యాల నుంచి కోరుట్ల వైపు మోటార్సైకిల్పై వస్తుండగా మోహన్రావుపేట క్రాసింగ్ వద్ద ఎదురుగా వస్తున్న మెట్పల్లి డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటరెడ్డి కుడి కాలు మోకాలు వరకు తెగిపోయి రోడ్డుపై పడిపోయింది. సంఘటన స్థలంలో కొద్ది సేపటికి సృ్పహా కోల్పోయిన వెంకటరెడ్డిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రైతు ఆత్మహత్యలు అరికట్టాలి
షాద్నగర్: సీఎం కేసీఆర్ రైతుల శవాలపై బంగారు తెలంగాణ నిర్మిస్తారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆత్మహత్యలకు పాల్పడిన చేసుకున్న రైతు కుటంబాలను పరామర్శిం చేందుకు పది వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన రైతు భరోసా బస్సు యాత్ర శని వారం షాద్నగర్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక ముఖ్యకూడలిలో ఏ ర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కరెంట్ కోత లు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. చిన్న, సన్న, పేద రైతులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీని వర్తింపజేస్తామని చెప్పి, 25శాతమే ఇచ్చారని విమర్శించారు. బంగారు తెలంగాణ ఏర్పాటులో రైతులు కూడా భాగస్వాములే అని వారి బాగోగుల ను కూడా పట్టించుకోవాలని ప్రభుత్వానికి హితవుపలికారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు సారంపల్లి మల్లారెడ్డి మా ట్లాడుతూ.. బంగారు తెలంగాణ రాష్ట్రం ఏ ర్పాటు చేస్తానని మాటలు చెబుతున్న కేసీఆర్ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై ఎం దుకు స్పందించలేదన్నారు. బడ్డెట్కు ముం దే ప్రభుత్వ లెక్కల ప్రకారం 80 మంది రై తులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి బడ్జెట్లో వారికి తక్కువ కేటాయింపులు ఉన్నాయని పేర్కొన్నారు. వామపక్షనేతలు అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ నాయకులు పానుగంటి పర్వతాలు, రాజు, నాగమణి, టంగుటూరి నర్మింహారెడ్డి పాల్గొన్నారు. రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న నిర్లక్ష్యం వైఖరివల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. రైతు భరోసా బస్సుయాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరింది. ఈ సందర్భంగా స్థానిక అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత కుటుంబాలను రూ.ఐదులక్షల పరిహారం ఇవ్వాలన్నారు. రైతులు ప్రైవేటుగా తీసుకున్న రుణాలను మాఫీచేయాలని కోరారు. వ్యవసాయానికి ఏడుగంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేం ద్ర, రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా, రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలనే డిమాం డ్తో పది వామపక్షాల ఆధ్వర్యం లో ఈనెల 11న హైదారాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బాధిత కుటుంబాలతో ధ ర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం సీపీఎం నేతలు సారంపల్లి మల్లారెడ్డి, శివా జీ, కోటేశ్వర్రావు, అచ్చుతారావు, వీర య్య, ఉపేందర్రెడ్డి మాట్లాడారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బా ర్, వెంకటేశ్, చంద్రకాంత్, ఆంజనేయులు, నరేష్, రాము పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement