-
పేలవంగా రాష్ట్రపతి ప్రసంగం: ఉత్తమ్
ఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం చాలా పేలవంగా ఉందని, చాలా సమస్యలపై స్పష్టత లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..దేశంలో నిరుద్యోగ సమస్య గురించి, రైతుల సమస్య గురించి రాష్ట్రపతి మాట్లాడలేదని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం మొత్తం బీజేపీ ప్రభుత్వాన్ని పొగడటానికే సరిపోయిందని చెప్పారు. 2014 కంటే ముందు ప్రభుత్వాలు అస్థిరమైన ప్రభుత్వాలని రాష్ట్రపతితో అనిపించడం బాధాకరమన్నారు. యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు కచ్చితంగా స్థిరమైన ప్రభుత్వాలని అన్నారు. యూపీఏ ప్రభుత్వ పాలనలో దేశ ప్రజలకు అద్భుతమైన, స్వచ్ఛమైన పాలనను అందించాయని చెప్పారు. ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో దేశం ఆర్ధికాభివృద్ధి చెందింది.. దాని కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంలో మాత్రం 2014 తర్వాతనే దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పడం విడ్డూరమన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో మహిళా రిజర్వేషన్ ప్రస్తావనే లేదని అన్నారు. ప్రతిసంవత్సరం దేశంలో లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. దాని నివారణ చర్యల గురించి పట్టించుకోలేదని తెలిపారు. ‘విదేశాల్లో దాగి ఉన్న నల్లధనం గురించి రాష్ట్రపతి ప్రసంగంలో మాట్లాడలేదు. బిహార్లో 110 మంది చిన్నపిల్లలు చనిపోతే దాని గురించి ప్రసంగంలో లేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామన్న బీజేపీ దానిని ఏవిధంగా అమలు చేస్తారో చెప్పలేదు. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. విభజన చట్టంలో తెలంగాణాకు రావాల్సిన అంశాలపై ప్రసంగంలో ప్రవేశపెట్టలేదు. ఈ ఐదు సంవత్సరాలు కూడా తెలంగాణాకి మొండి చెయ్యే అని స్పష్టంగా తెలుస్తుంద’ని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. -
ప్రతిపక్ష నేతగా దళితుడు ఉండొద్దా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత నీచంగా, వికృతంగా, గలీజు రాజకీయాలు చేసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రహస్య ప్రదేశంలో విలీన ప్రక్రియ పిటిషన్ తీసుకొని, మూడు గంటల్లోనే ప్రక్రియను ముగించారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా దళితుడు ఉండొద్దా అని ప్రశ్నించారు. అగ్రకుల అహంకారంతో అనైతికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న భ్రష్టు రాజకీయాలను తెలంగాణ సమాజం గుర్తించాలని కోరారు. గురువారం రాత్రి విలీన ప్రక్రియకు సంబంధించి బులెటిన్ వెలువడిన అనంతరం ఆయన ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యలతో కలసి గాంధీ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిన, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో లేకుండా చేయాలని చూడటం నీచమన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎంత తొక్కితే అంతగా బలపడతామని, చరిత్ర ఇదే చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నటికైనా టీఆర్ఎస్ను గద్దె దించేది కాంగ్రెస్ మాత్రమేనని గుర్తుపెట్టుకోవాలన్నారు. అనర్హత ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టిన స్పీకర్... ఫిరాయింపు ఎమ్మెల్యేలు విలీన లేఖ ఇచ్చిన గంటల్లోనే సానుకూల నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఉదయం నుంచి స్పీకర్ను సంప్రదించేందుకు చాలాసార్లు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపారు. కాంట్రాక్టుల సొమ్ము చెల్లిస్తామని ఉపేందర్రెడ్డిని, రూ. 26 కోట్ల పరిహారం ఇస్తామని హర్షవర్ధన్రెడ్డిని టీఆర్ఎస్లో చేర్చుకున్న టీఆర్ఎస్... రోహిత్రెడ్డిపై క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించి పార్టీలోకి రప్పించుకుందని ఉత్తమ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు చేస్తున్న అక్రమాలను శాసనసభలో ఎమ్మెల్యేలు ప్రశ్నించ కూడదని ఫిరాయింపులు చేస్తున్నారా లేక కేటీఆర్కు, హరీశ్రావుకు పంచాయితీ వస్తే ఎమ్మెల్యేలు హరీశ్ దగ్గరకు వెళ్తారన్న భయంతో ఇలా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. పార్టీ విలీన ప్రక్రియపై హైకోర్టును ఆశ్రయిస్తామని, అక్కడ వెలువడే తీర్పునుబట్టి సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రలోభాలు జరిగాయో రుజువులతో సహా అక్కడే నిరూపిస్తామన్నారు. విలీన ప్రక్రియకు నిరసనగా ఈ నెల 8న ఇందిరా చౌక్లో భట్టి విక్రమార్క నేతృత్వంలో సేవ్ డెమోక్రసీ పేరుతో 36 గంటలపాటు దీక్ష చేస్తామని వెల్లడించారు. ప్రజాస్వామ్యం ఖూనీ: భట్టి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని, ఫిరాయింపులను ప్రోత్సహించడం నేరమన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలని, ఒకవేళ పార్టీ మారితే వారిని అనర్హులుగా ప్రకటించాలి తప్ప పార్టీ మారిన వారి నుంచే విలీనపత్రం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ విధానం యావత్ దేశం పాకితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమకు సమయం ఇవ్వకుండా, అసెంబ్లీలో గాంధీ విగ్రహం వద్ద నిరసన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించాలని స్పీకర్ ఆదేశించడం దారుణమన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అసెంబ్లీలో మాట్లాడకుండా చేయడానికే విలీనం చేశారని దుయ్యబట్టారు. -
అక్రమం, అన్యాయం, అప్రజాస్వామికం...
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని అధికార టీఆర్ఎస్లో విలీనం ప్రక్రియపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. అప్రజా స్వామికంగా, అనైతికంగా, అక్రమ పద్ధతుల్లో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాన్ని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోం దంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసింది. కాంగ్రెస్ తరఫున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు, తమ పార్టీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలంటూ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని కలసి వినతిపత్రం ఇవ్వడంతో ఉలిక్కిపడ్డ కాంగ్రెస్ నిరసనలకు దిగింది. తమ పార్టీ ఇచ్చిన లేఖను ఆమోదించరాదని, ఇప్పటికే తాము పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన లేఖపై స్పందించాలని కోరేందుకు స్పీకర్ కార్యాలయాన్ని సంప్రదించినా బదులు రాకపోవడంతో సీనియర్ నేతలు అసెంబ్లీ సాక్షిగా నిరసనకు దిగారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని నినదించారు. పాదయాత్రగా ప్రగతి భవన్కు వెళ్లాలని నిర్ణయించడంతో పోలీసులు అసెంబ్లీ ముందు బైఠాయించిన నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగా విలీనంపై నిర్ణయమా? తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని కలసి కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేసే ప్రక్రియ కోసం లేఖ ఇస్తున్నారని తెలిసిన వెంటనే పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి స్పీకర్ కార్యాలయానికి ఫోన్ చేశారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే స్పీకర్ అందుబాటులో లేరని సిబ్బంది తెలపడంతో ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఎక్కడ ఉన్నారో కనుక్కొని చెప్పాలని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు ఫోన్లో సూచించారు. అలాగే ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ ఇచ్చిన లేఖపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కోరారు. అక్కడి నుంచి సమాధానం రాకపోవడంతో ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఫిరాయింపు ఎమ్మెలేలను స్పీకర్ ఎందుకు రహస్యంగా కలిశారో చెప్పాలని మీడియా ముందు డిమాండ్ చేశారు. మమ్మల్ని కలిసేందుకు స్పీకర్ ఎందుకు సమయం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగా విలీనంపై స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని అడిగారు. విలీనం చేసే అధికారం స్పీకర్కు లేదన్నారు. అసెంబ్లీ ముందు కాంగ్రెస్ నిరసన.. అప్రజాస్వామికంగా సీఎల్పీని విలీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రాహం ఎదుట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, అంజన్కుమార్ యాదవ్, మల్లు రవి నిరసనకు దిగారు. గాంధీజీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నల్ల రిబ్బన్లతో నిరసన తెలపాలని భట్టి భావించినా అధికారులు అందుకు అనుమతి నిరాకరించారు. దీంతో వారు అసెంబ్లీ గేటుకు ఎదురుగా రోడ్డుపై కూర్చొని నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. రెండు గంటలపాటు ధర్నా చేశారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ నినాదాలు చేశారు. తమ పార్టీ గుర్తుపై గెలుపొంది సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయాలని కోరుతున్న ఎమ్మెల్యేలందరిపైనా అనర్హత వేటు వేయాలని నేతలు డిమాండ్ చేశారు. వారికి మరికొంత మంది కాంగ్రెస్ నేతలు జతకావడంతో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఆయా నేతలు సీఎం తీరును నిరసిస్తూ ప్రగతి భవన్కు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించారు. ఆ కసరత్తు జరుగుతుండగానే అప్రమత్తమైన పోలీసులు... ఉత్తమ్, భట్టి, షబ్బీర్, శ్రీధర్బాబు, మల్లు రవి, అంజన్, ఇతర నేతలను అరెస్టు చేసి పోలీసు వాహనాల్లో తప్పాచబుత్ర పోలీస్ స్టేషన్కు తరలించారు. జాతీయ పార్టీని ఎలా విలీనం చేస్తారు: ఉత్తమ్ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో లేకుండా చేయాలని టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీనే నిర్వీర్యం చేసేలా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్.. సోనియా గాంధీ కాళ్లు పట్టుకొని తెలంగాణ తెచ్చుకున్న విషయాన్ని మర్చిపోయి, జాతీయ పార్టీని విలీనం చేయాలనుకోవడం దుర్గార్గమని మండిపడ్డారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ను టీఆర్ఎస్ఎల్పీలో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా ఎంఐఎంను నిలబెట్టేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల ఆశ చూపి, పదవులు ఎరవేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న పద్ధతులను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. అత్యంత అప్రజాస్వామికంగా, అనైతికంగా సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి విపరీత చర్యల కారణంగా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే ప్రమాదం దాపురించిందన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, కేసీఆర్ ఆగడాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కావాలనే, ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని ఉత్తమ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసే అధికారం స్పీకర్కు లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిరసనలకు పీసీసీ పిలుపు... తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, విచ్చలవిడిగా రాజకీయ ఫిరాయింపులు చేస్తూ టీఆర్ఎస్ రాష్ట్రంలో రాజకీయ వ్యబిచారం చేస్తోందని టీపీసీసీ దుయ్యబట్టింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ దిగజారుడు రాజకీయాలను ఎక్కడికక్కడ నిలదీయాలని పార్టీ శ్రేణులను కోరింది. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని సూచించింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం బిగించాలని, అక్రమ అరెస్టులను ఖండించాలని కోరింది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ విచ్చలవిడితనంపై ప్రజాస్వామ్యవాదులు, మేధావులు స్పందించాలని విన్నవించింది. -
అలాగైతే ప్రలోభాలకు గురిచేస్తారు: ఉత్తమ్
హైదరాబాద్: జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్ల ఎంపిక విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతి పత్రం సమర్పించామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘం అధికారులను కలిసిన వారిలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, జనసమితి, ఇతర పార్టీ నేతలు ఉన్నారు. ఈసీని కలిసిన అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్ ఎంపికకు 40 రోజుల గడువు పెడితే అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేస్తుందని, అలా చేయవద్దని కోరినట్లు చెప్పారు. ఫలితాలు వచ్చిన 3 రోజుల్లో చైర్మన్ల ఎంపిక జరిగేటట్లు చూడాలని కోరామన్నారు. బ్లాక్ మనీ, పోలీసులను ఉపయోగించి ఇతర పార్టీ నాయకులను అప్రజాస్వామిక పద్ధతిలో ఇదివరకే చేర్చుకున్నారని ఆరోపించారు. మే 27న కౌంటింగ్ చేసి 3 రోజుల్లో చైర్మన్ల ఎంపిక చేసి జూలై5 తర్వాత ఛార్జ్ తీసుకోవచ్చునని తెలిపారు. తెలంగాణాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు వెల్లడించారు. చట్టాలంటే కేసీఆర్కు గౌరవం లేదు: ఎల్ రమణ(టీటీడీపీ అధ్యక్షులు) చట్టాల పట్ల కేసీఆర్కు గౌరవం లేదని టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, చైర్మన్ల ఎంపిక పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరినట్లు వెల్లడించారు. ఫలితాల తర్వాత చైర్మన్ల ఎంపికకు ఎక్కువ సమయం ఇవ్వడం వల్ల 538 ఎంపీపీలు, 28 జెడ్పీ చైర్మన్లు టీఆర్ఎస్సే గెలిచే అవకాశం ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యం కూనీ: షబ్బీర్ అలీ కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేస్తున్నారని మాజీ మంత్రి , కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. ప్రభుత్వం, ఎన్నికల సంఘం పూర్తిగా కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. -
పీక్లానాయక్ తండాలో ఉద్రిక్తత
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement