-
అపర్ణా వెన్స్టర్ నుంచి కొత్త ఉత్పత్తులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన నిర్మాణ సామగ్రి ఉత్పత్తి సంస్థ అపర్ణా ఎంటర్ప్రైజెస్ యూపీవీసీ బ్రాండ్ అపర్ణా వెన్స్టర్ తాజాగా మార్కెట్లోకి పక్కకు జరిపే (స్లైడింగ్), మడతపెట్టే (ఫోల్డింగ్) యూపీవీసీ తలుపులను ప్రవేశపెట్టింది. స్లైడ్, ఫోల్డింగ్ కారణంగా 90 శాతం వరకు గాలి, కాంతి ఇంట్లోకి ప్రవేశిస్తాయని కంపెనీ తెలిపింది. ‘‘అదనపు బలాన్ని అందించేందుకు మల్టీ చాంబర్ సెక్షన్స్, వర్షపు నీటి ప్రవాహం కోసం రెయిన్ ట్రాక్, మృదువైన కదలికల కోసం నైలాన్ రోలర్లు ఏర్పాటు వంటివి వీటి ప్రత్యేకతలను యూపీవీసీ విభాగం సీఈఓ మహేశ్ చౌదరి తెలిపారు. వీటికి చెదలు, తుప్పు పట్టవని, అన్ని రకాల రంగులు, సైజ్లలో లభ్యమవుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. నెలకు 3 లక్షల చ.అ. యూపీవీసీ తలుపులు, కిటికీలను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటివరకు 14 లక్షల యూపీవీసీ ఉత్పత్తులను సరఫరా చేసింది. -
ఇంటి అందం రెట్టింపు
విపణిలోకి యూపీవీసీ తలుపులు, కిటికీలు సాక్షి, హైదరాబాద్ ఇంటికెవరొచ్చినా వారికి స్వాగతం పలికేవి తలుపులే. అందుకే అవి ఎంత అందంగా ఉంటే ఆ ఇంటి అందం రెట్టింపు అవుతుంది. అయితే గతంలో తలుపులు, కిటికీలను చెక్క, కలపతో చేయించేవారు. వీటి మన్నిక కొన్నేళ్లే ఉంటుంది. వీటి స్థానంలో ఇప్పుడు విపణిలోకి యూవీవీసీ తలుపులు, కిటికీలు వచ్చేశాయి. ధరలు కూడా అందుబాటులో ఉండటం, లెక్కలేనన్ని రంగులూ అందుబాటులో ఉండటం, మన్నిక విషయంలోనూ నాణ్యంగా ఉండటంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. యూపీవీసీ అంటే అన్ప్లాస్టిసైజ్డ్ పాలీవినైల్ క్లోరైడ్. దేశవ్యాప్తంగా తలుపులు, కిటికీల మార్కెట్ పరిమాణం ఏటా రూ.15 వేల కోట్లుగా ఉండగా, ఇందులో యూపీవీసీ తలుపులు, కిటికీల వాటా 20 శాతం వృద్ధి రేటుతో రూ.3 వేల కోట్లుగా ఉంటుందని విశ్లేషకుల అంచనా. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన యూపీవీసీ తలుపులు, కిటికీల వాడకం ప్రస్తుతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరించింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోవటం దీని ప్రత్యేకత. ఎక్కువ జీవితకాలం, పర్యావరణ అనుకూలం కలిసొచ్చే అంశాలు. సౌకర్యాలెన్నో.. ⇔ యూపీవీసీ తలుపులు, కిటికీలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను సులువుగా తట్టుకోగలవు. బలమైన గాలి, భారీ వర్షం వంటి ఉపద్రవాలను తట్టుకునే గుణం వీటి సొంతం. యూపీవీసీ తలుపులు, కిటికీలు 2,400 పీఏ ఒత్తిడి (సుమారుగా గంటకు 230 కి.మీ.వేగం)ని కూడా తట్టుకుంటాయని బ్రిటీష్ ప్రమాణాల్లో తేలింది. ⇔ సాధారణ తలుపులు నీటిలో తడిస్తే బిగుతుగా తయారవుతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటి M? లు 300 పీఏ వరకు నీటిలో తడిచినా కూడా బిగుతుగా మారవు. వీటి జీవితకాలం సుమారుగా 30 ఏళ్లు. ⇔ యూపీవీసీ తలుపులు, కిటికీలకు క్రమం తప్పకుండా నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. వీటికి చెదలు, తప్పు పట్టడం వంటివి పట్టవు. ఎందుకంటే వీటి తయారీలోనే చెదలు, తుప్పును నియంత్రించే గుణం ఉంటుంది. మాటిమాటికీ రంగులు వేయాల్సిన అవసరం కూడా లేదు. ⇔ అగ్ని ప్రమాదాల సమయాల్లో సాధారణ తలుపులు, కిటికీలు చాలా ప్రమాదంగా మారతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీల తయారీలో అగ్ని నిరోధక ద్రవ్యాలను వాడతారు. దీంతో అగ్ని ప్రమాదాలు జరిగినా మంటలను ఒక గది నుంచి వేరే గదుల్లోకి వెళ్లనీయదు. దీంతో నష్టం చాలా వరకు తగ్గుతుంది. ⇔ యూపీవీసీ తలుపులు, కిటికీలకు శబ్ధాన్ని, ఉష్ణాన్ని నిరోధించే గుణం ఉంటుంది. బయటి నుంచి 80 శాతం శబ్ధాన్ని, 60 శాతం ఉష్ణాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడుతుంది. దీంతో ఇంట్లో విద్యుత్ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. కనీసం 30 శాతం విద్యుత్ను ఆదా అవుతుంది. ⇔ సాధారణ తలుపులు, కిటికీలకు వేసే రంగులు గాల్లోకి రసాయనాలు వెదజల్లుతాయి. అందే యూపీవీసీ తలుపులు, కిటికీలు పర్యావరణహితమైనవి. అంతేకాకుండా యూపీవీసీ తలుపులు, కిటికీలకు ఉండే స్కూలు, గ్రిల్స్ బయటికి కన్పించవు. దీంతో దొంగలు వీటిని చేధించడం అంత సులువు కాదు. బొమ్మలు భలే సాక్షి, హైదరాబాద్: ఇంట్లో గోడలకు వేలాడదీసే బొమ్మలు మన అభిరుచులను అద్దం పడతాయి. అందుకే ఎక్కడి బొమ్మలు అక్కడే వేయాలి. లేకపోతే ‘వీడికి బొత్తిగా కళాభిరుచి లేదే’ అని పెదవి విరుస్తారు. ⇔ వంట గదిలో తాజా కనిపించే పండ్లు, కూరగాయలు తదితర తినుబండారాల చిత్రాలను వేలాడదీయాలి. మాంసాహార సంబంధిత బొమ్మలు కూడా అంతగా రుచించవు. ⇔ హాల్లో ప్రకృతి చిత్రాలు, పడకగదిలో ఊహా చిత్రాలు, పిల్లల గదుల్లో జంతువుల, పక్షుల చిత్రాలు, వృద్ధులు ఉండే గదుల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడే చిత్రాలను వేలాడదీయవచ్చు. ⇔ ఆఫీసుల్లో వెయింట్ హాల్లో అయితే అర్థంకాని చిత్రాలను అంటే మోడరన్ ఆర్ట్లను పెట్టుకోవచ్చు. ⇔ ఇంటికి వేసే రంగులూ మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. సున్నితమైన రంగులయితే మానసిక ప్రశాంత కలుగచేస్తాయి. ముదురు రంగులు మనస్సును అల్లకల్లోలం చేస్తాయని నిపుణులు చెబుతుంటారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్
రఘరామలీలలు కన్నెత్తి చూడరు.. పట్టించుకోరు
చంద్రబాబుపై బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు
KSR: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా మెంటల్ బాబు
డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులు
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement