-
మలుపుల వద్ద రక్షణ చర్యలు లేవు.. అదుపు తప్పితే.. అంతే..!
నిర్మల్: దస్తురాబాద్ మండలంలోని పలు గ్రామాలకు వెళ్లేందుకు వాహనదారులు జంకుతున్నారు. రోడ్ల పక్కన వ్యవసాయ బావులు ఉండటం.. మలుపుల వద్ద రెయిలింగ్ ఏర్పాటు చేయకపోవడంతో తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి రోడ్ల వెంట ఉన్న బావులను పూడ్చివేయడంతోపాటు మలుపుల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. కలమడుగు–పాండ్వాపూర్ వెళ్లే మార్గంలో.. మండలంలోని కలమడుగు నుంచి పాండ్వాపూర్ వెళ్లే మార్గంలో డబుల్ రోడ్డు కావడంతో వాహనాలు వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ మార్గంలో పెర్కపల్లె సమీపంలో మూడు వ్యవసాయ బావులు, మున్యాల గ్రామ సమీపంలో రెండు వ్యవసాయబావులు, రేవోజీపేట గ్రామసమీపంలో మూడు వ్యవసాయ బావులు, బుట్టపూర్ గ్రామ సమీపంలో మూడు వ్యవసామ బావులు రోడ్డు పక్కనే ప్రమాదకరంగా ఉన్నాయి. వాహనదారులు ఏ మాత్రం అదుపు తప్పినా ఇందులో పడిపోయే ప్రమాదం ఉంది. మలుపుల వద్ద కానరాని రక్షణ.. పాండ్వాపూర్–కలమడుగు రోడ్డు మార్గంలో ఉన్న మలుపుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. దస్తురాబాద్ మండల కేంద్రంలో కుమురంభీం చౌరస్తా వద్ద ప్రధాన రోడ్డుపై ఉన్న మలుపు వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. రోడ్డును ఆనుకొని చెట్లు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పెర్కపల్లె ప్రాథమిక పాఠశాలతోపాటు మున్యాల, రేవోజీపేట, బుట్టాపూర్ గ్రామాల్లో ఉన్న మలుపుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. అధికారులు స్పందించాలి.. రోడ్ల పక్కన వ్యవసాయ బావులు, మలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా ఆర్అండ్బీ అధికారులు సెఫ్టీ రాడ్లు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాల్సి ఉంటుంది.. కానీ ఇప్పటివరకు అధికారులెవరూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. రక్షణ చర్యలు చేపట్టాలి ప్రమాదాలు జరగకుండా రో డ్ల పక్కన ఉన్న వ్య వసా య బావులు, మూల మలుపుల వద్ద సెఫ్టీ రాడ్లను ఏర్పాటు చేయాలి. తరచుగా ప్రమాదా లు జరిగే చోట బోర్డులు ఏ ర్పాటు చేస్తే డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటారు. – భూక్య రమేశ్, ఎర్రగుంటవాసి సమస్య పరిష్కరిస్తాం కలమడుగు–పాండ్వాపూర్ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపడుతాం. వ్యవసాయబావులు, మూల మలుపులపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. రక్షణ చ ర్యలు చేపట్టి త్వరలోనే సమస్య పరిష్కరిస్తాం. – మల్లారెడ్డి, ఆర్అండ్బీ డీఈ -
యూపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది: ప్రియాంకా గాంధీ
లక్నో: ఉత్తరప్రదేశ్ లో మహిళలకు ఏమాత్రం భద్రత లేదని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా గురువారం యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాగా లక్నోలోని బాపూ భవన్లో ఓ ప్రభుత్వ అధికారి అక్కడ పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగిని వేధించి అరెస్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రియాంక యూపీ ప్రభుత్వం పై ఆరోపణలు చేశారు. సచివాలయం, రోడ్డు, బహిరంగ ప్రదేశాలలో మహిళలకు భద్రత కరువైందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రతపై యూపీ ప్రభుత్వం గొప్పగా చెప్తోందని కానీ వాస్తవానికి పరిస్థితులు ఆలా లేవని విమర్శించారు ప్రియాంక. ఓ సోదరి తనకెదురైన లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకోకపోవడంతో తాను వాటిని వీడియో తీసి వైరల్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.దేశ మహిళలంతా మీ వెంట ఉన్నారని బాధితురాలికి ఆమె భరోసా ఇచ్చారు. శాంతిభద్రతలు, మహిళల భద్రత సమస్యపై కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ వాదనను ఖండించింది. -
నైకీ, హెచ్అండ్ఎం బ్రాండ్స్కు చైనా షాక్
బీజింగ్: వీగర్ ముస్లింల అణిచివేత అంశంలో చైనా వైఖరిని వ్యతిరేకిస్తున్న విదేశీ కంపెనీలను కట్టడి చేయడంపై డ్రాగన్ దేశం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో హెచ్అండ్ఎం, నైకీ, జారా తదితర విదేశీ బ్రాండ్స్ .. పిల్లలకు హానికరమైన బొమ్మలు, దుస్తులు మొదలైనవి దేశంలోకి దిగుమతి చేస్తున్నాయంటూ ఆరోపించింది. ఈ వారంలో అంతర్జాతీయ బాల కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇలాంటి 16 కంపెనీలకు చెందిన టీ-షర్టులు, బొమ్మలు, టూత్బ్రష్షులు మొదలైన వాటిని ‘‘నాణ్యత, భద్రత పరీక్షలో అర్హత పొందని’’ ఉత్పత్తులుగా చైనా కస్టమ్స్ ఏజెన్సీ ఒక జాబితా తయారు చేసింది. వీటిని ధ్వంసం చేయడం లేదా వాపసు పంపడం చేస్తామని పేర్కొంది. అయితే, వివాదాస్పదమైన షాంజియాంగ్ ప్రావిన్స్ పరిణామాల గురించి గానీ, విదేశీ కంపెనీల విమర్శలను గానీ ఈ సందర్భంగా ప్రస్తావించలేదు. దుస్తులు, బొమ్మల్లో హానికారకమైన అద్దకాలు, ఇతర రసాయనాలు ఉన్నాయని మాత్రమే తెలిపింది. షాంజియాంగ్ ప్రావిన్స్లో వీగర్ ముస్లింలను అణిచివేస్తూ, వెట్టిచాకిరీ చేయిస్తోందంటూ చైనా ఆరోపణలు ఎదుర్కొంటోంది. అక్కడి ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల తమపైనా విమర్శలు వస్తుండటంతో హెచ్అండ్ఎం ఇకపై షాంజియాంగ్ ప్రావిన్స్లో ఉత్పత్తయ్యే పత్తిని తమ ఉత్పత్తుల్లో వినియోగించబోమంటూ ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆగ్రహించిన చైనా ఈ-కామర్స్ కంపెనీలు తమ ప్లాట్ఫామ్స్ నుంచి హెచ్అండ్ఎం ఉత్పత్తులను తొలగించాయి. ఆ కంపెనీతో పాటు నైకీ, అడిడాస్ వంటి ఇతర విదేశీ బ్రాండ్స్కి సంబంధించిన యాప్స్ను కూడా యాప్ స్టోర్స్ తొలగించాయి. అయితే తాజా పరిణామంపై నైక్, జారా, హెచ్ అండ్ ఎం ఇంకా స్పందించలేదు. -
ఆన్లైన్ చెకప్లతో చేటు
లండన్ : బిజీ లైఫ్లో వైద్యుల వద్దకు వెళ్లే తీరికలేని వారు ఆన్లైన్ డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆన్లైన్ వైద్యసేవలు అందించే సంస్థలు, వైద్యుల్లో 43 శాతం సురక్షితం కాదని కేర్ క్వాలిటీ కమిషన్ నివేదిక హెచ్చరించింది. వెబ్క్యామ్ అపాయింట్మెంట్స్ను ఆఫర్ చేస్తున్న బ్రిటన్కు చెందిన ఆన్లైన్ వైద్య సేవల సంస్ధల్లో సగానికి సగం సంస్ధల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రోగిని సరిగ్గా పరీక్షించకుండానే ఆన్లైన్ వైద్యులు పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్, గుండె జబ్బులకు మందులను సూచిస్తున్నారని పేర్కొంది. మరికొన్ని సంస్థలు ప్రమాదకర మందులను సైతం సిఫార్సు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కంపెనీలు వెబ్క్యామ్, లేదా స్కైప్ ద్వారా వైద్యులు రోగులను పరీక్షించే ఏర్పాట్లు చేస్తాయి. మరికొన్ని సంస్థలు ఆన్లైన్లో ఫాంను పూర్తిచేసిన తర్వాత దాని ఆధారంగా వైద్యులు మందులను సూచిస్తుంటారు. రెండు గంటల పాటు పరీక్షించాల్సిన అనారోగ్య సమస్యలను సైతం పదినిమిషాల వెబ్క్యామ్ అపాయింట్మెంట్తో తేల్చేస్తున్నారు. వీటికి రోగుల నుంచి భారీ మొత్తం గుంజుతున్నారని ఆ సంస్థ తెలిపింది. రోగి ఆరోగ్య చరిత్ర తెలుసుకోకుండా, పూర్తిగా పరీక్షలు నిర్వహించకుండానే ఆన్లైన్ డాక్టర్లు హై డోసేజ్ మందులను సిఫార్సు చేయడం ఆందోళనకరమని పేర్కొంది. -
విద్యాసంస్థల నిర్లక్ష్యం అపరిమితం!
ఏలూరు అర్బన్ : విద్యను పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చేసిన ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను గాలికొదిలేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి బస్ ఫీజుల పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్నా పిల్లల రక్షణకు సరియైన చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీఏ అధికారులు అనుమతించిన పరిమితి నిబంధనను తుంగలో తొక్కుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పైగా విద్యార్థులకు ప్రమాదం కలిగిస్తున్నా సంబంధిత ఆర్టీవో అధికారులు, ట్రాఫిక్ పోలీసులు నామమాత్రపు దాడులకే పరిమితమవుతుండడం విమర్శలకు తావిస్తోంది. గత చేదు అనుభవాలు l గతంలో పెదవేగి మండలంలోని ఒక విద్యా సంస్థ కేవలం 45 మంది విద్యార్థులను తరలించేందుకు అనుమతి ఉన్న బస్లో ఏకంగా 130 మంది చిన్నారులను తరలించేది. పలుమార్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎట్టకేలకు తల్లిదండ్రులు ధర్నాకు దిగడంతో యాజమాన్యం దిగొచ్చింది. l గత యేడాది నగరానికి చెందిన ప్రముఖ విద్యా సంస్థలు ఇదే విధంగా తమ కాలేజీలో చదువుకుంటున్న దూరప్రాంత విద్యార్థులను పరిమితికి తరలించేవారు. కేవలం 36 మంది మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉన్న వ్యాన్లో వందమందికి పైగా విద్యార్థులను తరలించడం గుర్తించిన నాటి ట్రాఫిక్ డీఎస్పీ పి.భాస్కరరావు బస్ను ఆపివేశారు. అందులో ఉన్న విద్యార్థులను లెక్కించగా ఏకంగా నూట ఐదుగురు ఉన్నారు. డీఎస్పీ నిర్ఘాంతపోయారంటే పరిస్థితి ఎంద ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. l స్థానిక తంగెళ్లమూడిలో ఉన్న ప్రముఖ పాఠశాల బస్లో ఇదేవిధంగా అపరిమితంగా విద్యార్థులను ఎక్కించడంతో డ్రైవర్కు స్టీరింగ్ సైతం తిప్పే అవకాశం లేకపోయింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి బస్సు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు చనిపోయారు. l జంగారెడ్డిగూడెంకు చెందిన విద్యాసంస్థ బస్లో పరిమితికి మించి విద్యార్థులు ప్రయాణిస్తున్న సమయంలో బోల్తా కొట్టడంతో 27 మంది పిల్లలకు గాయాలయ్యాయి. ఇవిగో నిబంధనలు విద్యార్థులను తరలించే బస్లలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వ జీవో 35లో స్పష్టంగా ఉందని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఎస్ మూర్తి ఇలా వివరించారు. l ఏదైనా ప్రమాదం సంభవిస్తే విద్యార్ధులకు ప్రాథమిక చికిత్స అందించేందుకు అవసరమైన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ బస్సులో ఉండాలి. కాలేజీ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ఆ బాక్స్లో ఉండాల్సిన మందుల పరికరాలు ఉన్నాయా? లేవా? అనే దానిపై 30 రోజులకు ఒకసారి పరీక్షించాలి. l బస్లో మంటలు చెలరేగితే వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిలిండర్ ఉండాలి. l బస్ బోల్తా కొడితే అందులో ఉన్న చిన్నారులను రక్షించేందుకు ఎమర్జెన్సీ డోర్ ఉండాలి. l చిన్నారులు కిటికీల గుండా తలలు, చేతులు బయటపెట్టేందుకు ఆవకాశం లేకుండా కిటికీలకు మెష్లు ఏర్పాటు చేయాలి. l సీనియర్ డ్రైవర్లను నియమించాలి. అదే సమయంలో వారి నుంచి ఫిజికల్ ఫిటెనెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. 60 ఏళ్లకు పైబడిన వయసు మళ్లిన వారిని డ్రైవర్లుగా నియమించకూడదు. l చిన్నారులు బస్లోకి ఎక్కేందుకు, దిగేందుకు అనువుగా బస్ ఫుట్బోర్డు మొదటి మెట్టు నేల నుంచి 325 మి.మీల ఎత్తులో అమర్చాలి. l అన్ని బస్లలో అటెండర్లు ఉండాలి. వారు పిల్లలు దిగే సమయంలో లోపలికి ప్రవేశించే సమయంలో జాగ్రత్తగా సహకరించాలి l విద్యార్థులు తమ స్కూలు బ్యాగులను పెట్టుకునేందుకు లగేజీ స్థలం ఉండాలి. ఈ నిబంధనలను పాటించని బస్ల విద్యా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని మూర్తి హెచ్చరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement